మహేష్ బాబు హీరోగా, రాజమౌళి డైరెక్షన్లో భారీ అడ్వెంచర్స్ డ్రామా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ సినిమాను రూపొందించేందుకు సిద్ధమవుతున్నాడు జక్కన్న. ప్రస్తుతం మూవీ టీమ్ అంతా ఈ సినిమాకు సంబంధించిన ప్రి ప్రొడక్షన్ పనులలో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెటింట వైరల్గా మారింది. ఈ మూవీని రెండు భాగాలుగా తీసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని సమాచారం. కథకు ఉన్న ప్రాధాన్యత రిత్యా.. ఒకే భాగంలో చెప్పడం సాధ్యం కాదని.. మేకర్స్ భావిస్తున్నారట. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్స్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాకు భారీ బడ్జెట్ కేటాయించనున్నారు. అలాగే స్టార్ నటీ, నటీమణులు భాగస్వాములు కానున్నారు. ఈ క్రమంలో సినిమా రెండు భాగాలుగా రానున్నట్లు వార్త వైరల్గా మారుతుంది.
ఈ అడ్వెంచర్స్ జానర్లో సీక్వెల్స్ మరిన్ని రానున్నాయని సమాచారం. అంటే ఇండియన్ జాన్స్ మాదిరిగా.. ఒకదాని తర్వాత ఒకటి సీక్వెల్స్ వస్తాయని పాత్రలు అవే ఉండి.. కథ కథనాలు మారుతాయి అని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న తాజా అప్డేట్ పై మూవీ టీం నుంచి ఎలాంటి అఫీషియల్ ప్రకటన లేదు. ఇలాంటి క్రమంలో రాజమౌళితో సినిమా అంటే దాదాపు మూడేళ్లు ఆ హీరో రాజమౌళికి సెరెండర్ అవ్వక తప్పదు. అలాంటిది మహేష్ మూవీ రెండు పార్ట్లు అంటే దాదాపు 5 ఏళ్ళు జక్కన్న దగ్గర లాక్ అయిపోయినట్లే అంటూ పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సినిమా షూట్ జనవరి నెలలో ప్రారంభమవుతుందని.. రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికీ అఫీషియల్గా ప్రకటించారు. ఈ కథ రాయడానికి దాదాపు రెండేళ్ల సమయం పట్టిందని.. ఆయన వెల్లడించాడు. ఇక మహేష్ పొడవాటి జుట్టు, గడ్డంతో పాత్రకు తగ్గట్టుగా మేకోవర్ అవుతున్న సంగతి తెలిసిందే. మహేష్ను జక్కన్న ఈ సినిమాలో సరికొత్త అవతార్లో చూపించనున్నాడు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే కథ కావడంతో పలువురు విదేశీయులు కూడా ఈ సినిమాలో నటించనున్నారు. భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషలోనూ పాన్ వరల్డ్ రేంజ్ లో సినిమాను రూపొందించనున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కె.ఎల్.నారాయణ ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం గరుడ టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు సమాచారము.