సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటిసారి రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై డాక్టర్ కె.ఎల్.నారాయణ, గోపాల్ రెడ్డి ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు దాదాపు రూ.1500 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనుంది. హీరోయిన్గా ఓ ఫారెన్ బ్యూటీని సెలెక్ట్ చేయనున్నారట. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు జుట్టు, గడ్డం పెంచి కొత్త లుక్లో ఆకట్టుకుంటున్నాడు. దాదాపు అగ్ర దర్శకులెవరూ ఖాళీగా లేకపోవడంతో.. చిన్న దర్శకులతోనే సినిమాలు నటించి నాన్ బాహుబలి కేటగిరిలో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన ఘనతను మహేష్ బాబు దక్కించుకున్నాడు.
ఇక కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను సినిమా ఏకంగా రూ.101 కోట్ల షేర్ ను రాబట్టి జంచలనం క్రియేట్ చేసింది. తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన మహర్షి సినిమా కూడా రూ.105 కోట్ల షేర్ కొల్లగొట్టింది. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరూ సినిమా నటించగా ఇది కూడా రూ.139 కోట్ల షేర్ రాబట్టింది. ఇలా ఐదు సినిమాలతో రూ.566 కోట్లు దక్కించుకున్న మహేష్.. గీతగోవిందం దర్శకుడు పరశురాం దర్శకత్వంలో సర్కారువారిపాట సినిమాలో మెప్పించాడు.
ఈ మూవీ యావరేజ్ టాక్ వచ్చినా తనకున్న క్రేజ్ తో ఈ సినిమా కూడా రూ.111 కోట్ల షేర్ రాబట్టింది. చివరగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం అయ్యితే అట్టర్ ఫ్లాప్ టాక్తో రూ..112 కోట్ల షేర్ వచ్చింది. ఇలా ఐదు సినిమాలతో కలిపి మహేష్ బాబు రూ.567 కోట్ల షేర్ రాబట్టారు. తెలుగులో మరే హీరోకు ఇది సాధ్యం కాలేదనడంలో అతిశయోక్తి కాదు. భవిష్యత్తులో అయినా ఎవరైనా ఈ రికార్డ్ బ్రేక్ చేస్తారేమో చూడాలి. ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న ఈ మూవీ 2027లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందట.