ఎన్ కన్వెన్షన్ కూల్చివేత.. నాగార్జున వివాదంలోకి సమంత..!

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఈ ఎన్ కన్వెన్షన్ పై అధికారులు..అక్రమంగా చెరువును ఆక్రమించి నిర్మించారని తేలడంతో కూల్చివేశారు. నాగార్జున తుమ్మిడి కుంట చెరువులో మూడున్నర ఎకరాల భూమిని కబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారని హైడ్రాకు ఫిర్యాదు అందడంతో భారీ బందోబస్తు మధ్య ఈ నిర్మాణాన్ని కూల్చివేశారు. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకి ఈ నిర్మాణం పైన ఫిర్యాదులు రావడంతోనే కూల్చివేయడం జరిగింది.

Akkineni Nagarjuna: నాగార్జున షాకింగ్ డెసీషన్.. జనం ఆలోచనలు మారాయి కాబట్టే  ఇలా! – News18 తెలుగు

ముఖ్యంగా ఎన్ కన్వెన్షన్ ను తాకుతూనే చెరువు నీళ్లు ఉంటాయి. ఈ నిర్మాణానికి సంబంధించి హైడ్రా పూర్తి వివరాలు సేకరించి కూల్చివేసింది. దీంతో నాగార్జున కు చెందిన నిర్మాణం కావడంతో అధికారులు కూల్చివేత వంటి సీరియస్ నిర్ణయాలు తీసుకుంటారా అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఎవరిని వదిలిపెట్టేది లేదు అని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథన్ తెలిపారు. దీనిపై స్పందించిన నాగార్జున రేవంత్ రెడ్డి ప్రభుత్వం గచ్చిబౌలిలోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను అక్రమ కట్టడం పేరుతో కూల్చి వేయడాన్ని నాగార్జున తీవ్రంగా తప్పుపట్టారు.

Samantha Ruth Prabhu - Wikipedia

ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఒక ప్రకటన విడుదల చేశారు. కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. కానీ అప్పటిలోపే కూల్చివేయడం బాధాకరం. ఎన్ కన్వెన్షన్ పై చర్యలు తీసుకొని చెరువు భూమిని గుర్తించాలని, 2014లో హైకోర్టు ఆదేశించింది. దీనిపై అప్పటి మంత్రి కేటీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. పదేళ్లు మౌనంగా ఉండిపోయారు. నాగార్జున మాజీ కోడలు సమంతని తీసుకొచ్చి తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. దీని వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ రఘునందన్ రావు కూడా కామెంట్లు చేశారు. దీంతో ఆయన ఈ వివాదంలోకి సమంతాను కూడా ఇప్పుడు లాగినట్లు అయింది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.