ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం లపై అణిచిత వ్యాఖ్యలు.. శ్రీ రెడ్డి పై కేసు నమోదు..!

టాలీవుడ్ కాంట్రవర్షియల్ బ్యూటీ శ్రీరెడ్డి.. ఈ పేరుకు తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అతితక్కువ సినిమాల్లో నటించిన ఈ హాట్ బ్యూటీ సినిమాల‌కంటే వివాదాలతో ఎక్కువ పాపులారిటీ దక్కించుకుంది. ఈ అమ్మడు ఎప్పటికప్పుడు రాజకీయాల్లో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. ప‌లు ట్రోల్స్‌ ఎదుర్కొంటూ ఉంటుంది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కి వీరాభిమానిగా తనను తాను చెప్పుకుంటూ తిరిగే శ్రీరెడ్డి.. ఇటీవల సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసింది. అస‌భ్య ప‌ద‌జాలంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా రెచ్చిపోయింది.

ఈ క్ర‌మంలో ఆమెపై కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో టీడీపీ నాయకులు కేసు నమోదు చేశారు. మంత్రి అనిత, నారా లోకేష్ లపై శ్రీ రెడ్డి తాజాగా మ‌రోసారి అనుచిత‌ వ్యాఖ్యలు చేస్తూ హేళనగా మాట్లాడింది. దీనిపై స్పందించిన తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ నాయకుడు రాజు యాదవ్ తన అనిచిత వ్యాఖ్యలు చేసిందంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా ఆయన పోలీసులకు సబ్మిట్ చేశారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. గతంలో క్యాస్టింగ్ కౌచ్ అంటూ పెద్ద ఎత్తున టాలీవుడ్‌లో రచ్చ రేపిన శ్రీరెడ్డి తర్వాత తన మక్కం చెన్నైకి మార్చేసింది. ఇక తర్వాత రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయినా ఈ అమ్మడు ఎప్పటికప్పుడు వైసీపీ మద్దతుగా మాట్లాడుతూ ఎన్నో వీడియోలు చేస్తూ ఉంటుంది.

Sri Reddy Posts 36 Heroines List | cinejosh.com

ఈ క్రమంలో టీడీపీ నేతలను అసభ్యకరంగా దూషిస్తూ.. నెటింట రచ్చ చేస్తుంది. ఈ క్రమంలో రాజు యాదవ్ ఆమె వ్యాఖ్యలపై మండిప‌డ్డారు. కేసు నమోదు చేస్తూ.. కేవలం నేతలను మాత్రమే కాదు.. వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా కించపరిచే విధంగా ఆమె మాట్లాడుతుందంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా సోషల్ మీడియా ఆధారంగా చేసుకుని కుటుంబ సభ్యులను దుషించ‌టం సరైన విధానం కాదంటూ మనసులో విషపు ఆలోచనలతో ఇలాంటి పనులు చేసే వారిపై సరైన చర్యలు తీసుకోవాలంటూ ఆయన పేర్కొన్నాడు. ఆమెను ఆదర్శంగా చేసుకుని ఇంకా ఎంతోమంది.. తమ భాషను అసభ్యకర పదజాలంతో మార్చుకొని మాట్లాడే అవకాశం ఉందని.. ముందే ఇలాంటి వారిని అరెస్ట్ చేసి తగిన బుద్ధి చెప్పాలంటూ డిమాండ్ చేశాడు.