మాజీమంత్రి రోజా క్యారెక్టర్ అలాంటిదే.. క్లాస్‌మేట్ షాకింగ్ కామెంట్స్..

ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఎలాంటి ఘోర పరాజయాన్ని చూసిందో అందరికీ తెలుసు. ఎన్నికల టైం లో కచ్చితంగా గెలుస్తామని చెప్పిన వైసీపీ కేవలం 11 స్థానాలతో క‌నీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో పార్టీ నేతల్లో అసహనం మొదలైంది. ఇలాంటి క్రమంలో ఈ పార్టీకి చెందిన మాజీ మంత్రి రోజాకు సంబంధించిన ఓ వార్త‌ వైరల్‌గా మారింది. రోజా మొదట టీడీసీలో అడుగుపెట్టి 2009 ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీని వదిలి వైసీపీలో చేరింది. 2014 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నుంచి వైసీపీ అభ్యర్థిగా ఘన విజయాన్ని సాధించిన రోజా.. మొదటిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టింది. ఇక అస‌లు విష‌యం ఏంటంలే రోజాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెటింట‌ వైరల్‌గా మారింది.

Roja's Strong Reaction To Bandaru's Character Attacks

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సినీనటి.. రోజా క్లాస్ మేట్‌ మాధవి రెడ్డి.. రోజా గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్ చేసింది. తను తిరుపతి బిఎస్‌సీ లో చేరాన‌ని. ఆదే సమయంలో రోజా కూడా తనతో పాటు అక్కడ చదువుకుందని వివరించింది మాధవి. ఆ రోజుల్లో రోజా తనకు మంచి ఫ్రెండ్ అని.. అప్పట్లోనే ఆమెకు సినిమా ఆఫర్లు వచ్చాయని.. మొదటి సినిమా ప్రేమ తప్పసు చేసేటప్పుడు మేము తిరుపతిలోనే ఉన్నామంటూ మాధవి రెడ్డి వివరించింది. ఈ క్రమంలో నువ్వు పనిమనిషి క్యారెక్టర్ కు బాగా సరిపోతావ్ అంటూ.. ఆమెను మేమంతా వెక్కిరించే వాళ్ళమని చెప్పుకొచ్చింది.

Actress Madhavi Reddy Shocking Comments on Rk Roja in Latest Interview |  Actress Madhavi Reddy: రోజా నా క్లాస్‌మేట్‌‌ , అప్పుడు నల్లగా ఉండేది -  పనిమనిషిగా బాగా సెట్ అయ్యావంటూ ...

చదువు పూర్తి అయిన తర్వాత రోజాను తాను కలవలేదని.. కొన్నేళ్ల తర్వాత రోజా హోస్ట్‌గా ఉన్న మోడ్ర‌న్‌ మహాలక్ష్మి షోలో నేను కూడా పార్టిసిపేట్ చేశా అంటూ వివరించింది. ఆ టైంలో నేను.. మీ డిగ్రీ క్లాస్‌మేట్ అని గుర్తు చేశానని.. వెంటనే రోజా తనను గుర్తుపట్టి అప్పట్లో నేను చాలా సైలెంట్ గా ఉండే దాన్ని కదా అని అన్నారని.. మాధవి లత వివరించింది. ఇక రోజా గురించి చెప్తూ.. చదువులో రోజా చాలా యాక్టివ్‌గా ఉండేదని.. వాక్‌చాతుర్యం, నటనతో పాటు ఇంటెలిజెన్స్‌ కూడా ఎక్కువైనంటూ ఆమెపై ప్రశంసలు వర్షం కురిపించింది. ప్రస్తుతం రోజా క్లాస్‌మేట్ మాధవి చేసినా కామెంట్సె నెటింటా వైరల్ గా మారాయి.