రాజ్తరుణ్, లావణ్య, మాల్వి మల్హోత్రా కేసు గత కొంతకాలంగా నెటింట సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రోజుకో సరికొత్త మలుపు చోటు చేసుకుంటుంది. ఇక మొదట్లో లావణ్య.. రాజ్ తరుణ్, మాల్వీ మాల్హోతులపై నర్సింగ్ పోలీస్స్టేషన్లో కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే రాజ్ తరుణ్ మోసం చేశాడని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మాల్వి మల్హోత్ర మాయలో పడి నన్ను వదిలేసాడంటూ ఆరోపించింది.
ఈ క్రమంలో పోలీసులు దర్యప్తు చేస్తండగానే.. లావణ్య తనకు అసభ్యకరమైన మెసేజ్లు పెడుతూ.. తన అన్నయ్యను వేధిస్తుందని మాల్వి మల్హోత్రా కేసు నమోదు చేసింది. ఇక ఈ కేసు పై పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో మాల్వీకు మరో బిగ్ షాక్ తగిలింది. రాజ్తరుణ్, లావణ్య, మాల్వి మల్హోత్రా కేసులో ముంబైకి చెందిన అసిస్టెంట్ ప్రొడ్యూసర్ యోగేష్ తల్లి ఇన్ఆల్వ్ అయ్యి ఓ షాకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. ఆమె మాట్లాడుతూ ప్రేమ పేరుతో ఆమె కొడుకుని మాల్వి మల్హోత్రా మోసం చేసిందని.. ఆస్తులన్నీ రాక్కొని మమ్మల్ని రోడ్డున పడేసిందంటూ ఆరోపణలు చేసింది.
అంతే కాదు ప్రేమ పేరుతో నా కొడుకు ఆమె వెంటపడుతున్నాడని ఫేక్ కేస్ పెట్టి జైలుకు పంపించిందని కన్నీరు పెట్టుకుంది. దీంతో పాట్టే మాల్వి.. యోగేష్ తో కలిసి తిరిగిన ఫ్లైట్ టికెట్స్, ఇద్దరి మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్, వ్యక్తిగత ఫోటోలు కూడా తన దగ్గర ఉన్నాయంటూ వాటిని బయట పెడుతూ ఓ వీడియోను రివీల్ చేసింది. తమ కొడుకు నాలుగేళ్లగా జైల్లోనే ఉన్నాడంటూ అసిస్టెంట్ డైరెక్టర్ యోగేష్ తల్లి ఎమోషనల్ అయిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. రానున్న రోజుల్లో ఈ కేసులో ఇంకెన్ని ట్విస్ట్లు తలెత్తుతాయో చూడాలి.