జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఏపీ ఉపముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి బిజీ గా గడుతున్న సంగతి తెలిసిందే. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న క్షణం నుంచి నిమిషం కూడా సమయాన్ని వృధా చేయకుండా ఎంతో శ్రమిస్తున్నాడు పవర్ స్టార్. ప్రజల సమస్యలను తెలుసుకోవడం.. అధికారులతో సమీక్షలు జరిపించి.. ఏం చేస్తే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందో లాంటి అంశాలపై ఫోకస్ పెట్టాడు. గత రెండు రోజులుగా కాకినాడ జిల్లాలో పర్యటించిన పవన్ తాజాగా పిఠాపురంలో పర్యటించి అక్కడే సభలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన సినిమాలపై క్లారిటీ ఇచ్చాడు. అభిమానులు ఓజీ, ఓజీ అంటూ సభ మధ్యలో అరవడం మొదలుపెట్టారు.
ఈ క్రమంలో పవన్ నవ్వుతూ దానిపై రియాక్ట్ అయ్యాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజలకు మెరుగైన పాలన అందించడం పైనే నేను ఫోకస్ చేస్తున్నానని.. ఈ టైంలో మనం ప్రజలకు చేయాల్సిన పనులు వదిలేసి సినిమా షూటింగ్ అంటే.. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయని చెప్పుకొచ్చాడు. తనను నమ్మి ఇంతటి భారీ సక్సెస్ అందించిన ప్రజలకు సేవ చేసుకోవడమే నా లక్ష్యమని.. కుదిరినప్పుడల్లా నెలలో రెండు, మూడు రోజులు సినిమా షూటింగ్లో పాల్గొని సినిమాలను పూర్తి చేస్తానంటూ వివరించాడు. ఇదే విషయంపై తాను ఒప్పుకున్న సినిమా నిర్మాతలకు, డైరెక్టర్లకు కూడా చెప్పానని.. స్కెడ్యూల్ తయారు చేసుకోవాలని వివరించినట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించాడు.
అయితే వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని తెరపైకి రానుందని.. ఓజి సినిమాను అందరూ చూడాలి.. సినిమా ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుందంటూ వివరించాడు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా బాగుంటుందంటూ చేసిన కామెంట్స్ అభిమానులకు ఆనందాన్ని ఇచ్చినా.. షూటింగ్ కేవలం నెలకు రెండు, మూడు రోజులు మాత్రమే ఉంటుందని.. దీంతో సినిమా వచ్చేందుకు కాస్త ఆలస్యం అవుతుందని చెప్పడంతో బిగ్ బాంబ్ పేలినట్టయింది. ఈ క్రమంలో అభిమానులు కాస్త నిరుత్సాహాన్ని వ్యక్తం చేసినా.. సినిమా రిలీజ్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.