బాలకృష్ణ, నాగార్జున కలిసి నటించిన ఏకైక మల్టీ స్టారర్ మూవీ ఏంటో తెలుసా.. డైరెక్టర్ ఎవరంటే..?!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ, అక్కినేని నాగార్జున ఇద్దరు ఎవరికి వారు వ‌రుస‌ సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న ఈ ఇద్దరు ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నారు. ఇక బాలకృష్ణ అయితే గత మూడు సినిమాలతో వరుస‌ బ్లాక్ బ‌స్టర్ హిట్లను అందుకుంటూ హ్యాట్రిక్‌తో దూసుకుపోతున్నాడు. నాగార్జున కూడా వరుస సినిమాలో నటిస్తున్నాడు. అయితే నాగార్జున‌, బాలకృష్ణ మధ్య ఎప్పటినుంచో సరైన సంబంధాలు లేవని ఇండస్ట్రీలో టాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియదు గానీ.. వీరిద్దరి మధ్య గ్యాప్ గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. అసలు వీరి మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది.. అసలు ఇది నిజమేనా.. అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇక బాలకృష్ణ ఎప్పటికప్పుడు తన తోటి హీరోలతో కలిసి కనిపిస్తూనే ఉంటారు.

Trimurtulu - Wikipedia

చిరంజీవి, బాలయ్య కలిసి కనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే వెంకటేష్ తో కూడా బాలయ్య చాలా సన్నిహితంగా ఉంటారు. వెంకటేష్ కూడా ఎవరితోనో గొడవలు పెట్టుకున్న దాఖలాలు ఉండవు. అయితే నాగ్‌, బాలయ్య మధ్య మాత్రం ఏదో గొడవ ఉందంటూ ఎప్పటినుంచో ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో వీరిద్దరి కాంబినేషన్‌లో మల్టీ స్టారర్ సినిమా వచ్చిందన్న సంగతి కూడా చాలామందికి తెలిసి ఉండదు. అయితే తాజాగా బాలకృష్ణ, నాగార్జున కలిసి నటించిన మల్టీ స్టార‌ర్ సినిమాకు సంబంధించిన వార్తలు నెటింట వైరల్‌గా మారాయి. ఇక నాగార్జున తండ్రి ఏఎన్నార్ అంటే బాలయ్యకు మొదటి నుంచి చాలా ఇష్టం. బాలయ్య నాగేశ్వరరావును చిన్నాన్న అని భావిస్తూ ఉంటారు. ఈ రిలేషన్ తోనే నాగార్జున, బాలకృష్ణ ఇద్దరు కలిసి నటించాలని ఆయన ఎన్నోసార్లు భావించారట.

Balakrishna- Nagarjuna : బాలకృష్ణ, నాగార్జున కలిసి నటించిన ఒకే ఒక్క సినిమా  ఎదో మీకు తెలుసా.? - Telugu News | Do you know the only movie where  Balakrishna and Nagarjuna acted together? | TV9 Telugu

కానీ కమ్యూనికేషన్ బాలేక పోవడంతో వీరిద్దరి సినిమా వర్కౌట్ కాలేదట. అయితే ఒక సినిమాలో మాత్రం వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సినిమా మరి ఏదో కాదు త్రిమూర్తులు. బాలకృష్ణ , నాగార్జున ఈ సినిమాల్లో కలిసి నటించి మెప్పించారు. వెంకటేష్ హీరోగా తెర‌కెక్కిన ఈ సినిమాలో బాలయ్య, నాగార్జున గెస్ట్ అపీరియన్స్ ఇచ్చారు. కే.మురళి మోహన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా.. 1987 జూన్ 24న రిలీజ్ రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాలో నాగార్జున, బాలకృష్ణతో పాటే చిరంజీవి, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు , విజయశాంతి, చంద్రమోహన్, మురళీమోహన్, పరుచూరి బ్రదర్స్, గొల్లపూడి పద్మనాభం, రాధా, భానుప్రియ, రాధిక, శారద, జయమాలిని, అనురాధ ఇలా ఎంతోమంది స్టార్ సెలబ్రిటీస్ గెస్ట్ అపీరియన్స్ ఇచ్చి సినిమాపై మరింత హైప్ పెంచారు. కానీ సినిమా అప్పట్లో ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే ఈ సినిమాలో ఓ పాటలు ఇలా ఇండస్ట్రీలో సగం మంది హీరో, హీరోయిన్స్ కనిపించడంతో అభిమానులు ఈ పాటను మాత్రం హైలెట్ చేశారు. ఇప్పటికీ ఈ సాంగ్ యూట్యూబ్ లో సందడి చేస్తూనే ఉంది.