వైజయంతి మూవీస్ బ్యానర్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ బ్యానర్ పై ఎన్నో హిట్ సినిమాలు కు ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు అశ్వినీ దత్త్. ప్రస్తుతం కూతుర్లతో కలిసి భారీ బడ్జెట్ సినిమాలను రూపొందిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా రిలీజ్ కు సిద్ధమవుతున్న భారీ ప్రాజెక్టు కల్కి 2898 ఏడీ. ప్రభాస్ హీరోగా.. నాగ్ అశంవిన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. జూన్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో వైజయంతి మూవీస్ కు ఆ పేరు ఎలా వచ్చింది.. ఎవరు పెట్టారు.. అనే న్యూస్ వైరల్ గా మారింది. అశ్విని దత్కు చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అంటే వీరాభిమానం.. సినిమాలపై ఉన్న ఆసక్తితోనే తండ్రిని ఒప్పించి నిర్మాణరంగంలోకి అడుగు పెట్టాడు. అశ్విని దత్త్ తన 19 ఏళ్ళ వయసులో ససావరిన్ సినీ ఎంటర్ప్రైజెస్ బ్యానర్ పై విశ్వనాధ్ డైరెక్షన్లో ఓ సీత కథ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు.
అప్పుడే తన ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ ను కలిసిన ఆయన.. అన్నగారితో ఒక సినిమా తీయాలని భావించారు. ఓ రోజు తెల్లవారుజామున ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి విషయం చెప్పగా.. అది విని ఆయన షాక్ అయ్యారట. ఓకే అంత దూరం నుంచి వచ్చి మంచి సినిమా తీయాలని భావిస్తున్నావ్ బానే ఉంది. ఇంత చిన్న ఏజ్ లో సినిమా తీస్తున్నావ్.. చాలా గ్రేట్.. కానీ నాతో సినిమా ఎందుకు.. అసలు నా సినిమా మార్కెట్ ఏంటో నీకు తెలుసా.. అని ప్రశ్నించారట. నాకు అవన్నీ తెలియవు. మీతో సినిమా తీయాలంతే అని అశ్వినీ దత్త్ తనడంతో ఎన్టీఆర్ నవ్వి అక్కడినుంచి వెళ్లిపోయారట. అలా రెండు మూడు సార్లు ఎన్టీఆర్ ను కలిసి అదే ప్రతిపాదికను అశ్వినీ దత్త్ వినిపించడంతో ఆయన పట్టుదల చూసి బాపయ్య అని మంచి కుర్రాడు ఉన్నాడు.. నువ్వు వెళ్లి కలువని వివరించారట ఎన్టీఆర్.
దీంతో దర్శకుడు కే. బాపయ్య, ఎమ్. ఎస్. రెడ్డిలను పిలిచి సినిమా తీసే ఏర్పాట్లు చేశారని అశ్వినీ దత్త్ స్వయంగా వివరించారు. ఇక కాల్ షీట్ పై సంతకం పెడితూ సంస్థకు ఏం పేరు పెడుతున్నామని ఎన్టీఆర్ అడిగారట. కృష్ణుడిపై పెట్టాలనుకుంటున్న మీరు పెట్టండి అని అశ్వినీ దత్త్ చెప్పాడట. దీంతో కృష్ణుడి మెడలో వైజయంతి మాల ఉంటుంది కదా.. దాని గుర్తుగా ఎన్టీఆర్ తన స్వహస్తాలతో వైజయంతి మూవీస్ అని రాశారట. అలా వైజయంతి మూవీస్ పేరు మీదగా బ్యానర్ స్టార్టై ఎదురులేని మనిషి తెరకెక్కింది. ఎన్టీఆర్, వాణిశ్రీ జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ రెండో సినిమా యుగ పురుషుడు కూడా కే.బాపయ డైరెక్షన్లో ఈ బ్యానర్ పైన తెరకెక్కించారు. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది. అలా మొదలైన వైజయంతి మూవీస్ ప్రయాణం 50 సంవత్సరాల పూర్తి చేసుకుని విజయపధంగా సాగుతుంది.