స్టార్ బ్యూటి అదా శర్మకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులో పలు సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు టాలీవుడ్ అవకాశాలు తగ్గడంతో.. బాలీవుడ్కు చెక్కేసి అక్కడ వరుస అవకాశాలను అందుకుంటూ పాపులారిటీ దక్కించుకుంటుంది. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు ఓ దివంగత నటుడు ఫ్లాట్లో నివసిస్తుందని తెలియడంతో అంతా షాక్ అవుతున్నారు. అతనెవరో కాదు సుశాంత్ సింగ్ రాజ్పుత్.పేరు చెప్పగానే చాలామంది ఎమోషనల్ అయిపోతుంటారు. కారణం చాలా కెరీర్ ఉన్న యంగ్ హీరో అతి చిన్న వయసులోనే తన ఫ్లాట్లో ఆత్మహత్య చేసుకుని ఫాన్స్ కు షాక్ ఇచ్చాడు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో నెపొటిజం కారణంగానే ఆయన చనిపోయాడంటూ మొదట్లో నెటింట వార్తలు వైరలైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ ఫ్లాట్లో నటి ఆదాశర్మ మక్కాం పెట్టింది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. దాదాపు నాలుగు నెలల నుంచి తాను సుశాంత్ ఫ్లాట్లోనే ఉంటుందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆమె వివరించింది. భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ సుశాంత్ ఫ్లాట్లోనే ఉండడానికి గల కారణాలను చెప్పుకొచ్చింది. ఎన్నో ఆసక్తికర విషయాలను రివిల్ చేసింది. నేను నాలుగు నెలల క్రితం ఈ ఫ్లాట్ కి షిఫ్ట్ అయ్యానని.. నా సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉండడంతో సరిగ్గా సదురుకోవడం కుదరలేదు అంటూ చెప్పుకొచ్చింది.
అయితే ఇటీవల మొత్తం వస్తువులు, సామాన్లు అన్నీ ఫ్లాట్లో సర్దేసుకున్నా.. ఇక్కడ ఉంటే ఏదో పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి.. కేరళ, ముంబై లో మా ఇంటి చుట్టు చెట్లు ఉంటాయి. ఆహ్లాదంగా ఉంటుంది. అదే చుట్టూ పచ్చని వాతావరణం ఈ ఫ్లాట్ కు కూడా ఉండడంతో ఇక్కడకు నేను షిఫ్ట్ అయ్యా అంటూ చెప్పుకొచ్చింది. అలానే ఈ ఫ్లాట్లోకి వేరే ఏం ఆలోచించకుండా దిగిపోయానని అదాశర్మ వివరించింది. ప్రస్తుతం అదాశర్మ చేసిన కామెంట్స్ వైరల్ అవ్వడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.