కరోనా .. పుణ్యమాంటూ లాక్ డౌన్ రావడం లాక్ డౌన్ లో ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ ఎక్కువైపోవడం మనం చూసాం . ఒకప్పుడు సినిమా అంటే థియేటర్స్ కి వెళ్లే జనాలు చూసేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ రోజులు మారిపోయాయి . 15 రోజులు ఆగితే ఓటిటీలో సినిమా రిలీజ్ అవుతుంది. హ్యాపీగా ఇంటిళ్లపాది ఇంట్లోనే కూర్చొని చూడొచ్చు. కొన్ని వెబ్ సిరీస్ షోస్ సినిమాలు డైరెక్ట్గా ఓటీటీ లోనే రిలీజ్ అయిపోతున్నాయి ఇంకెందుకు థియేటర్ కి వెళ్లడం అన్న ఆలోచనలో కూడా జనాలు ఉన్నారు. ఆ కారణంగానే సోషల్ మీడియాలో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఎక్కువ పుట్టుకొచ్చేసాయి .
కాగా వన్ ఆఫ్ ద టాప్ ఓటీటీ తాజాగా అభిమానులకి ఊహించిన షాక్ ఇచ్చింది. ప్రపంచంలోనే దాదాపు ప్రతి దేశంలో కూడా నెట్ ఫ్లిక్స్ సేవలను అందిస్తుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా భారతదేశంలో నెట్ ఫ్లిక్స్ వాడే వాళ్ళ సంఖ్య చాలా చాలా ఎక్కువ. అలాంటి ఇండియన్స్ కు భారీ షాక్ ఇచ్చింది నెట్ ఫ్లిక్స్.. భారతదేశంలోని ప్రజలు ఒక నెట్ ఫ్లిక్స్ ఖాతా ద్వారా 10 లేదా 15 మందితో పంచుకునేవారు .
సపోజ్ ఇండియాలో నెట్ ఫ్లిక్స్ లాగిన్ డీటెయిల్స్ తీసుకుంటే అమెరికా ..కన్నడ ఇలా ఏ దేశంలో ఉన్న ఆ అకౌంట్ తో అందరూ ఎంజాయ్ చేసేవాళ్ళు . అయితే ఇప్పుడు అలాంటి వాటికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుంది నెట్ ఫ్లిక్స్. భారతదేశం కోసం ప్రత్యేక ప్యాకేజ్ ని విడుదల చేసింది . 199 ఆఫర్ రిలీజ్ చేసింది . అయితే ఇది ఒక స్క్రీన్ కి మాత్రమే పరిమితం అవుతుంది. ఈ అకౌంట్ ద్వారా కేవలం ఒక వైఫై మాత్రమే యాక్సెప్టబుల్ చేస్తుంది . NetFlix హౌస్ హోల్డ్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది . మీరు మొదటి నెట్ ఫిక్స్ ని ఆక్టివేట్ చేసినప్పుడు.. ఏ వైఫై ఖాతా అయితే వర్క్ చేస్తుందో అదే ఖాతా ద్వారా ఆ లాగిన్ డీటెయిల్స్ వర్క్ చేస్తాయి ..మిగతా ప్రదేశాలలో అది నిలిపివేస్తుంది . ఇలా చేయడం ద్వారా నెట్ ఫ్లిక్స్ కస్టమర్ల సంఖ్య పెరుగుతుంది అంటూ భావిస్తున్నారు. ఆ కారణం చేతనే నెట్ ఫ్లిక్సీ నిర్ణయం తీసుకుందట..!!