“అది జరిగి సరిగ్గా ఏడాది”..నీహారిక పాత మెమోరీస్ ని గుర్తు చేసుకుంటుందా..?

సోషల్ మీడియాలో ఒక పాన్ ఇండియా హీరోయిన్ కి మించిన రేంజ్ లో క్రేజ్ పబ్లిసిటీ దక్కించుకుంది నిహారిక . ఆఫ్ కోర్స్ బడా ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి కాకపోతే సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం కన్నా ట్రోలింగ్కి ఎక్కువగా గురైంది . నిహారిక ఏ కారణంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురైందో అన్న విషయం కూడా మనకి బాగా తెలుసు. కాగా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వచ్చే నిహారిక విడాకుల తర్వాత మరింత యాక్టివ్ గా మారింది.

అందుకే ఆమె పెట్టే ప్రతి పోస్ట్ కూడా నెట్టింట సంచలనంగా మారిపోతూ ఉంటుంది . తాజాగా హీరోయిన్ నిహారిక తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంది . మనకు తెలిసిందే నిహారిక డెడ్ పిక్సెల్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ పెద్దగా జనాలను ఆకట్టుకోలేకపోయింది . అయితే ఈ డెడ్ పిక్సెల్ రిలీజ్ ఏకంగా సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ నటుడు అక్షయ పెట్టిన పోస్ట్లు రీషేర్ చేసింది నిహారిక .

అందులో డేడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్ పోస్టర్ తో పాటు ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా ఉంది . “నా ఫస్ట్ లవ్ కు ఏడాది కంప్లీట్ అయింది . లవ్ అంటే రెడ్ కలర్ హాట్ కాదండోయ్ లవ్ అంతే థాంక్యూ ఆదిత్య మండల “అని ఉంది అలాగే మేలో మళ్లీ స్ట్రీమింగ్ అందుబాటులోకి రానున్నట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నిహారిక పోస్టు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. నిహారిక పలు సినిమాలలో హీరోయిన్గా నటిస్తూనే పలు సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేయాలి అంటూ డిసైడ్ అయింది . నిహారిక తనకాళ్లపై తాను నిల్చోడానికి బాగా కష్టపడుతుంది..!!