రష్మిక మందన్నా.. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే బ్యూటీ . ఈమె గురించి ఎంత చెప్పకున్నా తక్కువే.. పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకున్న సరే సోషల్ మీడియాలో మాత్రం అభిమానులతో చిట్ చాట్ చేస్తూనే ఉంటుంది. సెకండ్ టైం దొరికిన సరే అభిమానులతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది ఈ నేషనల్ క్రష్ . రీసెంట్గా రష్మిక మందన్నా చేసిన పని అభిమానులను బాగా ఆకట్టుకుంది .
అంతేకాదు ఆమె సంబంధించిన ఫొటోస్ బాగా వైరల్ గా మారాయి . తాజాగా బ్లాక్ టీ షర్ట్ ధరించి ఫేస్ కనిపించకుండా దాచేసిన కొన్ని సెల్ఫీ ఫొటోస్ షేర్ చేసింది రష్మిక మందన్నా.. వాటికి క్యాప్షన్ ఇస్తూ ..”మీపై మంచి ఫోకస్ వెలుగు ఉంది.. అని మీకు తెలిసినప్పుడు ..మీకు అర్థం అయినప్పుడు ..సెల్ఫీలు తీసుకున్నప్పుడు ..చాలా చాలా సిగ్గుపడతారు ..అంతే కదా “అంటూ రాసుకొచ్చింది.
ప్రస్తుతం ఆమె ఫొటోస్ పైన కామెంట్లు పెడుతున్నారు అభిమానులు. సిగ్గుపడుతూ చాలా క్యూట్ గా ఉన్నావ్.. చాలా ముద్దుగా ఉన్నావంటూ.. ఫన్నీ ఫన్నీ కామెంట్స్ తో నేషనల్ క్రష్ పేరు ట్రెండ్ చేస్తున్నారు . కాగా సోషల్ మీడియాలో ఎప్పుడు రష్మికకు సంబంధించిన ఒక రూమర్ బాగా వైరల్ గా మారుతూ ఉంటుంది . హీరో విజయ్ దేవరకొండ తో ఆమె పెళ్లి.. ఇది రూమరా..? లేక నిజమా..? అనేది ఆమె లేదా..?విజయ్ దేవరకొండ చెప్తేనే బాగుంటుంది అంటారు ఫ్యాన్స్. ప్రెసెంట్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీ బిజీగా ఉంది రష్మిక మందన్నా..!
View this post on Instagram