ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో మల్టీ స్టారర్ సినిమాల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో ఆర్ఆర్ సినిమా వచ్చి సూపర్ సక్సెస్ సాధించడంతో ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ప్రతి డైరెక్టర్ మల్టీ స్టారర్ సినిమాలను తెరకెక్కించి సక్సెస్ సాధించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ ను తెరకెక్కించనున్నట్లు తెలుస్తుంది. అయితే దీనికి రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాతో మరోసారి మెగా ఫ్యామిలీ స్టార్డంను ప్రపంచవ్యాప్తంగా ప్రూవ్ చేయాలని భావిస్తున్నారట.
ఇక దీంతో పాటు ఈ సినిమాలో చిరంజీవి ఓ గెస్ట్ రోల్ లో కూడా కనిపించబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. నిజంగానే ఈ కాంబోలో సినిమా తెరకెక్కితే చూడాలని ఆశ పడుతున్నారు. మెగా ఫ్యామిలీ స్టార్ హీరోలు మొత్తం ఒకే స్క్రీన్ పై కనపడితే చూడాలని ప్రేక్షకులు ఆశపడుతున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది దీనికి దర్శకులు ఎవరు.. అనే దానిపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. దీనిపై ఎన్నో చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది.
ఇక ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయాన్ని కూడా బయటకు రాకుండా చాలా సీక్రెట్ గా మెయింటెయిన్ చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఈ మూవీకి రామ్చరణ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఏ అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. కానీ సినీ ఇండస్ట్రీ విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు ఈ మెగా హీరోల కాంబోలో మల్టీ స్టారర్ సినిమా వస్తుందంటూ తెలుస్తుంది. అయితే వీరికి కాంబినేషన్ లో నిజంగానే సినిమా వస్తుందా..? లేదా..? వస్తే ఈ సినిమా ఎప్పుడు వస్తుంది..? దీనికి డైరెక్టర్ ఎవరు..? అనే విషయాలను స్వయంగా సినిమాకు సంబంధించిన టీం ఎవరైనా తెలియజేసే వరకు వేచి చూడాలి.