2025 సిల్వర్ స్క్రీన్ పై టాలీవుడ్ ముద్దుగుమ్మల గ్లామర్ డోస్ మరింతగా పెరగనుంది. కొత్త అందాలు సందడి కనిపించకున్నా.. ఇప్పటికే ఫామ్ లో ఉన్న హాట్ బ్యూటీల సందడి మరింతగా పెరగనుంది. రెండు, మూడు సినిమాలతో అలరించేందుకు మన ముద్దుగుమ్మలు సిద్ధమవుతున్నారు. ఇంతకీ అలా చేతినిండా సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తున్న ఆ టాప్ ముద్దుగుమ్మలు ఎవరో ఒకసారి తెలుసుకుందాం.
రష్మిక మందన:
టాలీవుడ్ నేషనల్ క్రష్ రష్మిక మందన ఇప్పటికే రెండు సినిమాలతో ఆడియన్స్ను పలకరించింది. సల్మాన్ ఖాన్ జంటగా నటించిన సికిందర్ నిరాశపరిచిన.. ఛావా సినిమాతో రష్మికకు భారీ బ్లాక్ బస్టర్ దక్కింది. అంతేకాదు.. ప్రస్తుతం కుబేర, ది గర్ల్ ఫ్రెండ్, థామా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతుంది. వీటిలో కుబేర, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలు ఈ ఏడాది ఆడియన్స్ ను పలకరించనున్నాయి.
శ్రీ లీల:
టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ లీల ఈ మధ్య కాస్త జోరు తగ్గించినా.. మళ్లీ ఫామ్లోకి వచ్చి ఫుల్ బిజీ గా గడిపేస్తుంది. ఇప్పటికే రాబిన్హుడ్ సినిమాతో ఆడియన్స్ను పలకరించిన ఈ అమ్మడు.. త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. కార్తీక్ ఆర్యన్కు జంటగా ఆషికీ 3తో ఆడియన్స్ ను పలకరించనుంది. రవితేజకు జంటగా మాస్ జాతర సినిమాలో మెరవనుంది. అఖిల్ సరసన లెనిన్, తమిళ్ శివ కార్తికేయన్ పక్కన పరాశక్తి సినిమాలతో ఆడియన్స్ను పలకరించడానికి సిద్ధమవుతుంది.
భాగ్యశ్రీ బోర్సే:
సిల్వర్ స్క్రీన్ పై భాగ్యశ్రీ బోర్సే.. స్లో అండ్ స్టడీగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ అమ్మడు విజయ్ దేవరకొండకు జంటగా కింగ్డం సినిమాతో మే 30న ఆడియన్స్ను పలకరించనుంది. దీనిపై ఇప్పటికి ఆడియన్స్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా తర్వాత రామ్కు జోడిగా ఓ సినిమాలో నటిస్తుంది. అంతేకాదు.. దుల్కర్ సల్మన్ హీరోగా రూపొందుతున్న కాంత సినిమాలోను ఈ అమ్మడు హీరోయిన్గా మెరువనుంది. ఇలా ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడిపేస్తున్నారు.