తెలుగు బుల్లితెర బిగెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8.. కంటెస్టెంట్లలో ఒకరిగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి.. తన పర్ఫామెన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆదిత్య ఓం.. గత వారం ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన ఆదిత్య.. వరస ఇంటర్వ్యూలో పాల్గొంటూ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ గురించి ఆయన ప్రస్తావించారు. ఉదయ్ కిరణ్ మరణం గురించి ఆదిత్యా ఓం మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్గా మారాయి.
ఆదిత్య మాట్లాడుతూ ఉదయ్ కిరణ్ టాలెంటెడ్.. సక్సెస్ఫుల్ హీరో అని.. సక్సెస్ లో ఉన్న వ్యక్తికి సడన్గా ఫెయిల్యూర్ రావడంతో ఆయన తట్టుకోలేకపోయాడు అంటూ చెప్పుకొచ్చాడు. దాదాపు తనకు అదే పరిస్థితి వచ్చిందని ఆదిత్య ఓం చెప్పుకొచ్చాడు. అయితే నాకు రైటర్ గాను పట్టు ఉండటంతో అటు వెళ్లిపోయానని.. ఇండస్ట్రీలో హీరోగా ఉండడం కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగడం చాలా ప్రశాంతంగా ఉంటుందంటూ చెప్పుకొచ్చాడు. హీరోగా చేస్తే కేవలం హీరో గానే ఇండస్ట్రీలో కొనసాగల్సి వస్తుంది. ఒకవేళ అవకాశాలు రాకపోతే సినిమాలు ఎందుకు నటించలేదని.. అడుగుతారు. ఒకవేళ ఫ్లాప్ అయితే ఎందుకు సక్సెస్ కాలేదని ప్రశ్నిస్తారు అంటూ ఆదిత్య చెప్పుకొచ్చాడు.
హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలంటే వారికి ఫిజికల్ ఫిట్నెసే కాదు.. మెంటల్ హెల్త్ కూడా బాగా అవసరం అంటూ వెల్లడించాడు. ఇంకా ఉదయ్ కిరణ్ ఈ పరిణామాలను తట్టుకోలేకపోయారని.. నాతో రెండు సినిమాలు చేసిన విజయ సాయి కూడా ఇలానే సూసైడ్ చేసుకున్నాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. హీరోగా కొనసాగాలంటే మొదట మెంటల్ హెల్త్ బాగుండాలని.. లేదంటే చాలా కష్టం అంటూ వెల్లడించాడు. ఇక ఇండస్ట్రీలో జరిగే పాలిటిక్స్ గురించి కూడా ఆదిత్య ఓంకు ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆయన రియాక్ట్ అవుతూ.. ఇండస్ట్రీ పాలిటిక్స్ అంటే నేనేమీ చెప్పలేను కానీ.. నాకైతే మంచి ప్లాట్ఫామే దొరికిందంటూ వెల్లడించాడు. ఈ సందర్భంగా ఆదిత్య ఓం చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.