కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రశాంత్ డైరెక్షన్లో సినిమా నటించేందుకు ఎంతమంది స్టార్ హీరోస్ కూడా ఆసక్తి చూపుతున్నారు. కెరీర్ మొదటనుంచి ఇప్పటివరకు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చినది అతి తక్కువ సినిమాలైనా.. తాను తెరకెక్కించిన ప్రతి సినిమాతో సంచలన విజయాన్ని సృష్టించి రికార్డు క్రియేట్ చేసిన ఈ డైరెక్టర్ ఫ్యూచర్లో మొత్తం నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పుడు ఆ నాలుగు సినిమాలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇక ప్రశాంత్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా రూపొందించనున్నాడు. ఈ సినిమా పనులలో బిజీగా ఉన్నాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. కాగా సినిమా రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ ఇటీవల అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. తారక్ ఈ సినిమాకు బల్క్ డేట్లు కేటాయించనునట్లు తెలుస్తోంది. 2026 జనవరి 9 సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్, ప్రభాస్తో సలార్ 2 పై దృష్టి సారించనున్నాడు. ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఇప్పటికే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తారక్ సినిమా పూర్తి అయిన వెంటనే సలార్ 2పై ఫోకస్ చేయనున్నాడు ప్రశాంత్. ఇక ఈ సినిమా తర్వాత కేజిఎఫ్ 3పై ఆయన దృష్టిసారించనునట్లు సమాచారం. ఇక కేజిఎఫ్ ఫ్రాంచైజ్ ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ డిమాండ్ ఏర్పడింది.
కేజీఎఫ్ 3 సినిమా బాక్సాఫీస్ దగ్గర రిలీజ్తే సరికొత్త రికార్డులు సృష్టిస్తుందనటంలో అతిశయోక్తి లేదు. ఇక హీరో యష్ కూడా ఈ సినిమాలో నటించేందుకు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అంతేకాదు మెగా పవర్ స్టార్ చరణ్.. ప్రశాంత్ నీల్ కాంబోలో 2029లో సినిమా సెట్స్ పైకి రానుంది. వీరిద్దరి కాంబోలో రానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ నెలకొంటుందో వేచి చూడాలి. ప్రస్తుతం చరణ్కు గ్లోబల్ రేంజ్లో విపరీతమైన క్రేజ్ ఉంది. చరణ్ను అభిమానించే అభిమానుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతూ ఉండడం విశేషం. ఈ క్రమంలో చరణ్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్టులకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తు నటిస్తున్నారు. ఇలా ప్రశాంత్ వరుసగా నాలుగు సినిమాలతో దాదాపు ఆరేళ్లపాటు ఫుల్ బిజీ బిజీగా గడుపనున్నాడు.