టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఓ సినిమా నటించనున్న సంగతి తెలిసిందే. ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్తో అడ్వెంచర్స్ థ్రిల్లర్గా తెరకెక్కనున్న ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్లో రిలీజ్ చేసేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నాడట. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన గ్రాఫికల్ ఎఫెక్ట్స్ పై మరింత ఫోకస్ చేసిన జక్కన్న.. ఏఐ టెక్నాలజీని కూడా నేర్చుకుంటున్నట్లు.. ఆ విషయాలు తమ టీం తో చర్చించినట్లు సమాచారం.
మహేష్ చేయనున్న ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని మరోసారి చాటి చెప్పే ప్రయత్నాల్లో రాజమౌళి బిజీగా ఉన్నట్లు సమాచారం. అయితే ఏ స్టార్ డైరెక్టర్కు అయినా తమ సినిమాల కోసం ఎంచుకున్న హీరో.. గతంలో నటించిన సినిమాలన్నీ నచ్చాలని రూలేం లేదు. అలాగే రాజమౌళికి కూడా మహేష్ నటించిన సినిమాల్లో రెండే సినిమాలు అంటే చాలా ఇష్టమట. ఆ సినిమాల్లో మహేష్ నటన ఆయనకు బాగా నచ్చుతుందని చెప్పుకొచ్చాడు.
ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ మహేష్ నటించిన సినిమాల్లో ఒక్కడు, పోకిరి సినిమాలంటే తనకు చాలా ఇష్టమని.. ఈ రెండు సినిమాల్లో మహేష్ తనని తాను కొత్తగా చూపించుకున్నారని.. మహేష్ బాబు చాలా గొప్ప నటుడు. తాను అనుకుంటే ఎలాంటి పాత్రనైనా ఇట్టే నటించగల సత్తా ఆయనలో ఉంది అంటూ రాజమౌళి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రాజమౌళి చేసిన కామెంట్స్ నెటింట వైరల్ గా మారుతున్నాయి. ఇక జక్కన – మహేష్ కాంబో మూవీ జానవరీ నుంచి ప్రారంభం కానుందట.