పాన్ ఇండియా హీరోగా పేరు పొందిన ప్రభాస్ హవా రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. అటు మార్కెట్ పరంగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ శాసిస్తూ ఉన్నారు. ప్రభాస్ సినిమా రిలీజ్ అంటే చాలు ఆటోమేటిగ్గా ఇతర హీరోల సినిమాలు కూడా పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. ప్రభాస్ సినిమాల వల్ల నిర్మాతలకు మాత్రం లాభాలు వస్తూనే ఉన్నాయి… అందుకని ప్రభాస్ ఈ తరహా లోనే సేఫ్ జోన్ చిత్రాలను చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.
సినిమాల కథలు ఎంపికలో కూడా చాలా డిఫరెంట్ గానే ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది.ఇటీవల విడుదలైన కల్కి 2898AD సినిమా కూడా సుమారుగా రూ .1100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డులను అందుకుంది. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న మరొక చిత్రం రాజా సాబ్. ఇటివలె గ్లింప్స్ విడుదల చేయక పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా ప్రభాస్ హిందీలో చాలా స్టైలిష్ లుక్ లో కనిపించడంతో అభిమానులు తెగ సంబరపడుతున్నారు. డైరెక్టర్ మారుతి కూడా ఈ చిత్రాన్ని రొమాంటిక్ హర్రర్ కామెడీ నేపథ్యంలోనే తెరకెక్కిస్తున్నారు.
ఇండియాలోనే నెంబర్ వన్ టాప్ హీరోగా పేరు పొందుతున్న సమయంలో హర్రర్ కామెడీ జోనర్లో సినిమాలు చేసిన వారిలో కేవలం ఇద్దరు హీరోలే ఉన్నారట. గతంలో 2005లో రజనీకాంత్ చంద్రముఖి సినిమా నటించే సమయంలో నెంబర్ వన్ హీరోగా ఉన్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి రజనీకాంత్ కెరీర్ కి ప్లస్ అయింది. ఇప్పుడు కూడా ప్రభాస్ నెంబర్ వన్ హీరో గా ఉన్న సమయంలో హర్రర్ జోనర్ వైపు అడుగు వేయడంతో కచ్చితంగా కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ఇలాంటి ఘనత కేవలం ఈ ఇద్దరు హీరోలకే ఉందని అప్పుడు రజనీకాంత్ అయితే ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.