సాధారణంగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ సెలబ్రిటీగా ఇమేజ్ క్రియేట్ అయిన తర్వాత హై రెమ్యునరేషన్ అందుకుంటూ లగ్జరీ లైఫ్, ఖరీదైన కార్స్, పెద్ద పెద్ద విల్లా ఎలా వారు సంపాదించిన ఆదాయాన్ని భూములపై, అత్యాధునిక సౌకర్యాలు కలిగిన ఇళ్లపై వారు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఓ హీరోయిన్ మాత్రం ఏకంగా ఐలాండ్ కొనేసి అందరికీ షాక్ ఇచ్చింది. అయితే ఇప్పటివరకు అలా సొంత ఐలాండ్ ఉన్నవారు కేవలం భారత దేశంలో ముగ్గురే ఉన్నారు. ఇంతకీ ఆ ముగ్గురులో ప్రైవేట్ ఐలాండ్ ఉన్న వారిలో ఈ హీరోయిన్ ఎవరు..? అనుకుంటున్నార ఆమె ఓ బాలీవుడ్ హీరోయిన్. ఇక ఆమెకు దాదాపు 8 సంవత్సరాల నుంచి ఒక్క హిట్ సినిమా కూడా పడలేదు.
కానీ ప్రైవేట్ ఐల్యాండ్ ఉంది. ఇంతకీ ఆమె ఎవరు.. అలా ప్రైవేట్ ఐలాండ్ కొనడానికి ఆమెకు అసలు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి.. అనే సందేహాలు మీకు మొదలయ్యాయి కదా. ఆమె మరెవరో కాదు క్షలంక సోయగం జాక్వాలిన్ ఫెర్నాండెజ్. ఈమె ఖాతాలో దాదాపు 8 సంవత్సరాల నుంచి ఒక్క హిట్ సినిమా కూడా లేదు.. కానీ అవకాశలు ఈ్దుకుంటూనే ఉంది. అలాడిన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. మర్డర్, హౌస్ ఫుల్ 2, రేస్ 2, కిక్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి స్టార్ బ్యూటీ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. చివరిగా హౌస్ ఫుల్ 3 సినిమాతో సక్సెస్ అందుకున్న జాక్వాలిన్.. ప్రస్తుతం అక్షయకుమార్ హీరోగా నటిస్తున్న వెల్కమ్ టూ జంగిల్.. మూవీలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక జాక్వాలిన్ 2012లో తన సొంత దేశం శ్రీలంకలో ఓ ప్రైవేట్ ఐలాండ్ కొనుగోలు చేసింది. అప్పట్లో దాని విలువ చాలా తక్కువట. కేవలం రూ.3 కోట్లకే ప్రైవేట్ ఐలాండ్ను తన సొంతం చేసుకున్న జాక్వెలిన్ వరుసగా సినిమాలన్నీ హిట్ కొడుతున్న సమయంలో.. దాన్ని కొనుగోలు చేసింది. ఇక ఈ ప్రైవేట్ ఐలాండ్లో ఆధ్యాత్మిక సౌకర్యాలు కలిగిన ఒక మంచి భవనాన్ని నిర్మించాలని ఆలోచనలో ఉందని తెలుస్తుంది. ఇక ఈ భవనాన్ని తను ఉండడానికి ఇల్లుగా వాడాలా.. లేదంటే వాణిజ్య సమధాయంగా ఉపయోగిద్దాం అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీకి రాలేదట. కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటున్న ఈ అమ్మడు ఇలా ప్రైవేట్ ఐలాండ్ కొనుగోలు చేయడం గురించి తెలిసి ఆశ్చర్యపోతున్నారు. అమ్మడు తెలివికి ఫీదా అవుతున్నారు. ఇలా ప్రైవేట్ ఐలాండ్ కొనుగోలు చేసుకుని తన పేరుపై ఉంచుకోవడం ఎప్పటికైనా మంచిదేనా అని.. ఏ అవసరాల కైనా దీనిని ఉపయోగించుకోవచ్చు అంటూ నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.