ఇటీవల వెలువడిన హేమ కమిటీ నివేదిక సోషల్ మీడియాలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే హేమ కమిటీ ఇచ్చిన నివేదికపై ఎంతో మంది స్టార్ సెలబ్రిటీస్ కూడా తమమ శైలిలో రియాక్ట్ అవుతున్నారు. ఇదే క్రమంలో తాజాగా హేమా కమిటీ నివేదికను ప్రతి ఒక్కరు స్వాగతించాలంటూ.. సినీ నటి.. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బు కామెంట్ చేశారు. ఇక ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఖుష్బు రాణించిన సంగతి తెలిసిందే. ఇక ఖుష్బు మాట్లాడుతూ.. ప్రతి ఇండస్ట్రీలోనూ సినీ ఇండస్ట్రీ తరహా పరిస్థితుల్లో ఉన్నాయంటూ.. తన ఆవేదనను వెల్లడించింది.
ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ ని షేర్ చేసిన ఖుష్బు.. సినీ పరిశ్రమకు చెందిన మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి తమకు ఎవరైనా వేధింపులను బయటకు చెప్పాలని.. దానికోసమే ఈ హేమా కమిటీ రిపోర్ట్ ఉపయోగించబడిందని.. పేర్కొంది. ఈ విషయంపై తన కూతుర్లతో కూడా మాట్లాడానంటూ చెప్పిన ఖుష్బు.. బాధితులకు అందరి మద్దతు చాలా అవసరం అంటూ చెప్పింది. ఖుష్బూ సమస్య ఎదురైన వెంటనే వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు అంటూ చాలామంది ప్రశ్నిస్తున్నారు.. తమకు ఎదురైన వేధింపుల గురించి మాట్లాడే ధైర్యం అందరికీ ఉండదు కదా అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇక తన సొంత తండ్రి చిన్నతనంలో ఆమెను వేధించారని.. కాపాడాల్సిన ఆయనే నరకం చూపించాడు అంటూ వివరించింది.
ఈ దారుణాని బయట పెట్టడానికి ఎందుకు అంత టైం తీసుకున్నవ్ అని చాలామంది గతంలో ప్రశ్నించారు. నిజమే నేను ముందే మాట్లాడి ఉండాలి. కానీ.. నేను ఫేస్ చేసిన వేధింపులు కెరీర్ బిల్ట్ చేసుకునే క్రమంలో జరిగిన వేధింపులు కాదని గుర్తించండి అంటూ చెప్పుకొచ్చింది. చాలామంది మహిళలకు కుటుంబం నుంచి సరైన మద్దతు ఉండదని.. అర్థం చేసుకోవాలంటూ ఖుష్బు చెప్పుకొచ్చింది. సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని వస్తున్న చిన్న గ్రామాలకు చెందిన ఎంతో మంది అమ్మాయిల ఆశలను మొదట్లోనే తుంచేస్తున్నారంటూ ఫైర్ అయింది. ప్రస్తుతం ఖుష్బు.. హేమా కమిటీ నివేదికపై రియాక్ట్ అవుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవ్వడంతో.. అంత ఆశ్చర్యపోతున్నారు. ఏంటి.. ఖుష్బు తన సొంత తండ్రి చేతిలో వేధింపులకు గురైందా అంటూ.. అసలు ఏం జరిగి ఉంటుంది అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.