తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ ఎన్టీఆర్ వారసులుగా బాలయ్య , జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి హీరోలు మాత్రమే ప్రస్తుతం కొనసాగిస్తూ ఉన్నారు.. ఈ హీరోలకు సైతం కాస్త ఫ్యాన్ బెస్ బాగానే ఉందని చెప్పవచ్చు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ ను నందమూరి కుటుంబం దూరం పెట్టిందనే వార్తలు కూడా వినిపించాయి. ఇదంతా పక్కన పెడితే బాలయ్య ఇంట్లో అప్పట్లో జరిగిన కాల్పుల సంఘటన తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విషయం పైన సీనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి మాట్లాడుతూ పలు విషయాలను బయటపెట్టింది.
లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. తనలాగే జూనియర్ ఎన్టీఆర్ ని కూడా నందమూరి కుటుంబం నుంచి వెలివేసారని తెలిపారు.. తన తాత లాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా పేరు సంపాదిస్తున్నారనే ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతోంది నందమూరి కుటుంబం అంటూ తెలిపింది. అలాగే బెల్లంకొండ సురేష్ ని కాల్చడానికి జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమానే కారణమని తెలిపింది లక్ష్మీపార్వతి.
అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆది సినిమా బాలకృష్ణ నటించిన ఒక చిత్రాన్ని థియేటర్లో నుంచి తీసేసి మరి ఆది సినిమా వేయడంతో ఈ గొడవ జరిగిందని అందుకే బాలయ్య కాల్పులు జరిపారని లక్ష్మీపార్వతి వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ విషయం తెలిసి అభిమానులు కాస్త ఆశ్చర్యపోతున్నారు.. మరి లక్ష్మి పార్వతి చేసిన ఈ కామెంట్లకు అటు బాలయ్య కానీ బెల్లంకొండ సురేష్ గాని స్పందిస్తారేమో చూడాలి మరి.