సైలెంట్‌గా ఎన్టీఆర్‌ను సెట్ చేసుకున్న ఆ క్రేజీ డైరెక్టర్.. ఊహించ‌ని కాంబో..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్‌ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్లో ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హిరోయిన్‌గా నటిస్తుంది. అలాగే బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలిఖాన్ విల‌న్‌గా కనిపించనున్నాడు. ఆర్ఆర్ఆర్‌ సినిమా తర్వాత ఎన్టీఆర్ నుంచి వ‌స్తున్న‌ సినిమా కావడం.. ఎన్టీఆర్ నుంచి ఓ సినిమా రిలీజ్ అయి చాలా కాలం కావడంతో దేవర సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

అప్పుడప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అంటూ అభిమానులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తో కలిసి మల్టీస్టారర్ మూవీ వార్ 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఓ క్రేజి డైరెక్టర్ సినిమాలో ఎన్టీఆర్ న‌టించ‌నున్నాడంటూ వార్త‌లు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ క్రేజీ డైరెక్టర్ ఎవరు ఒకసారి తెలుసుకుందాం. నాచురల్ స్టార్ నాని హీరోగా గ‌తేడాది రిలీజ్ అయిన హాయ్ నాన్న. ఈ సినిమా ఏ రేంజ్‌లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుందో తెలిసిందే.

 

ఈ సినిమాకు కొత్త డైరెక్టర్ శౌర్యవ్ దర్శకత్వం వహించాడు. మొదట యూట్యూబర్‌గా భారీ పాపిలారిటీ దక్కించుకున్న ఆయన.. తరువాత నాని హాయ్ నాన్న‌ సినిమాలో అవకాశాన్ని ద‌క్కించుకుని బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్నాడు. డిసెంబర్ 7న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షో తోనే పాజిటివ్ టాక్ రావడంతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు.ఈ క్రమంలో చాలామంది మిడిల్‌రేంజ్‌ హీరోలు.. ఇత‌నితో సినిమాలు చేయడానికి ఎదురు చూశారు. అయితే శౌర్యవ్‌ మాత్రం ఒకేసారి కుంభస్థలానికి ప్లాన్ చేశాడని ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ ను ఒప్పించి తన సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

తారక్ ఇమేజ్ కు మ్యాచ్ అయ్యేలా శౌర్యవ్‌.. పాన్ ఇండియన్ కథను డిజైన్ చేసి ఎన్టీఆర్‌కు వినిపించాడని.. ఆ క‌థ‌ తారక్‌కు కూడా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఈ సినిమా కూడా హాయ్ నాన్న నిర్మాతలు అయిన వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వాళ్ళే నిర్మించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో.. ఇది నిజంగా ఎవ్వరు గెస్ చేయని కాంబో అంటూ.. ఈ కాంబో వర్కౌట్ అయితే మాత్రం సినిమా మంచి సక్సెస్ అందుకుంటుందంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.