సినీ ప్రపంచం అంటేనే రంగుల ప్రపంచం అన్న సంగతి తెలిసిందే. ఈ రంగుల ప్రపంచంలో స్టార్డం అందుకోవాలన.. ఆ స్టార్డం నిలబెట్టుకోవాలన్న ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అయితే స్టార్ గా మంచి స్టేటస్ సాధించిన తర్వాత లగ్జరీ లైఫ్ లాడ్ చేస్తూ హ్యాపీగా సెలబ్రేట్ లు తమ జీవితం గడిపేస్తారని అంతా భావిస్తూ ఉంటారు. కానీ కొందరు లైఫ్ మాత్రం అందరూ అనుకున్నంత లగ్జరీగా, హ్యాపీగా ఉండదు. సినీ లైఫ్ బాగున్నా.. పర్సనల్ లైఫ్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకొనే ఆమె మూడా ఎకరు. స్టార్ హీరోయిన్గా ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఓ హీరోయిన్.. తన భర్త వల్ల ఎదుర్కొన్న సమస్యలు గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది.
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో..? తన భర్త వల్ల ఎలాంటి సమస్యలు..? ఎదుర్కుందో ఒకసారి తెలుసుకుందాం. బాలీవుడ్ స్టార్ బ్యూటీ కరిష్మా కపూర్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దశాబ్దాలు పాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన ఈ అమ్మడు.. తన నిజ జీవితంలో భర్త కారణంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొందట. ఆయన నుంచి దూరమైన తర్వాతే ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నానని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక ఈ ముద్దుగుమ్మ చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఇప్పుడే రీఎంట్రీకి ప్రయత్నిస్తుంది. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో కపూర్ ఫ్యామిలీకి ఉన్న పేరు ప్రఖ్యాతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కుటుంబం నుంచి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, హీరోస్, హీరోయిన్స్ ఇలా ఎంతోమంది అడుగుపెట్టి స్టార్ సెలబ్రిటీలుగా రాణించారు.
అదే కపూర్ ఫ్యామిలీ నుంచి 1991 లో కరిష్మా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో హిట్ సినిమాలు నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ లాంటి స్టార్ హీరోల సరసన కూడా నటించి మెప్పించింది. ఇక కరిష్మా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తనకు సంబంధించిన ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది. తన మ్యారేజ్ లైఫ్ గురించి షాకింగ్ విషయాలను రివిల్ చేసింది. కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో దేశంలోనే పెద్ద వ్యాపారవేత్త అయిన సంజయ్ కపూర్ను పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. అయితే వారిద్దరి మధ్యన జరిగిన గొడవల కారణంగా 2016లో అతడికి విడాకులు ఇచ్చిందట కరిష్మా. ఇక వీరి విడాకుల తర్వాత కరిష్మా చేసిన షాకింగ్ కామెంట్స్ సంచలనం సృష్టించాయి.
పెళ్లయిన తొలిరాత్రే తన భర్త సంజయ్ తనను చిత్రహింసలు చేశాడని.. పెళ్లి తర్వాత హనీమూన్ కు వెళ్ళిన టైం లో అతని స్నేహితులతో రాత్రి గడపాలని ఒత్తిడి చేశాడని.. వివరించింది. అంతేకాదు ఏకంగా డబ్బు కోసం వేలం వేయడానికి కూడా అతను సిద్ధమయ్యాడు అంటూ చెప్పుకొచ్చింది. కరిష్మా ను తన తల్లితో ఆమెను కొట్టించాలని చూసాడని అప్పట్లో కెమెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. మొత్తం మీద విడాకులు తీసుకున్న ఈ అమ్మడుకు సంజయ్ కపూర్ నుంచి విలాసవంతమైన ఇంటితో పాటు.. రూ.14 కోట్ల భరణం కూడా వచ్చిందని టాక్. ఇదిలా ఉంటే ఈ అమ్మడు గతంలో సినిమాల్లో నటిస్తున్న టైం లో అభిషేక్ బచ్చన్ తో ప్రేమలో పడింది. అయితే వీరికి నిశ్చితార్థం జరిగిన తరువాత ఏవో మనస్పర్ధలతో వీరు విడిపోయారు. తర్వాత సంజయ్ కపూర్ వివాహం చేసుకోవడం ఎన్నో ఇబ్బందుల పడింది చివరకు ఆతనినకి కూడా విడాకులు ఇచ్చింది కరిష్మా.