టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే .. ఫస్ట్ షో రిలీజ్ అవుతుంది అంటే చాలు.. అభిమానుల సందడి వేరే లెవెల్ లో ఉంటుంది. కలెక్షన్లు మోత మోగిపోతుంది. అయితే గత కొంతకాలంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఒక్క సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఈ క్రమంలో ఎప్పుడెప్పుడు పవర్ స్టార్ నుంచి ఓ సినిమా వస్తుందా అంటూ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా పవర్ స్టార్ అభిమానులకు పూనకాలు తెప్పించే ఓ అప్డేట్ నెటింట తెగ ట్రెండ్ అవుతుంది.
అసలు మేటర్ ఏంటంటే క్రిస్ డైరెక్షన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు సినిమా చాలా కాలం క్రితమే సెర్చ్ పైకి వచ్చిన సంగతి తెలిసిందే అయితే ఒక కారణాలతో సినిమా ఆలస్యం కావడం క్రిష్ సినిమా నుంచి తప్పుకోవడంతో ఈ సినిమాకు జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నాడు ఈ నేపథ్యంలో త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది అంటూ వార్తలు నెటింట వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే సగం పైగా షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ కేవలం 20, 25 రోజులు పవన్ డేట్లు కేటాయిస్తే సినిమా మొత్తం పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించిన తర్వాత సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. అయితే గత కొంతకాలంగా రాజకీయాల్లో బిజీగా ఉండడంతో పవన్ సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు.
ఇక తాజాగా డిప్యూటీ సీఎం గా పగ్గాలు చేపట్టిన పవర్ స్టార్ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్ట్ మొదటివారం నుంచి సినిమాకు డేట్స్ కేటాయించనున్నట్లు తెలుస్తుంది. అప్పటి నుంచి ఒక్క 20 రోజులు సినిమాకు డేట్స్ కేటాయిస్తే సినిమా పూర్తి అవుతుంది. వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకుని డిసెంబర్ మొదటి వారంలో సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ యాక్షన్ సీన్స్ హైలెట్గా నిలవనున్నాయి. కాగా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఎం.ఎం. రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక పవన్ నుంచి వస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఎప్పటినుంచి ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.