ప్రస్తుతం ఇండస్ట్రీలో దర్శకులు తమ ఆలోచన తీర్పు తగ్గట్టుగా.. కథలని తామే రాసుకుంటూ సినిమాలు తెరకెక్కిస్తున్నారు. కానీ.. గతంలో దర్శకుల చుట్టూ ఆస్థాన రచయితలు ఉండేవారు. వాళ్ళు అందించిన కథలను ఎంచుకుంటూ దర్శకులు సినిమాను తెరకెక్కించేవారు. ఆయా దర్శకులు ఇమేజ్ బట్టి.. వాళ్ళ కథలను సిద్ధం చేసేవారు రచయితలు. అలా ఒక సినిమాకు ఒక రచయిత. లేదంటే ఇద్దరు రచయితలు మాత్రం పని చేసేవారు. అలాంటిది ఒకే ఒక సినిమా కోసం ఏకంగా 27 మంది రైటర్స్ పని చేసి.. సినిమాను తర్కెక్కించారట. ఆ సినిమాలో హీరోగా మెగాస్టార్ నటించడం విశేషం. ఇంతకీ ఆ సినిమా ఏంటో.. దాని రిజల్ట్ ఏమైందో ఒకసారి తెలుసుకుందాం. ఆ మూవీ మరేదో కాదు జగదీకవీరుడు.. అతిలోకసుందరి. చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన ఈ సినిమాకు ఏకంగా 27 మంది రైటర్లుగా పనిచేశారని స్వయంగా మూవీ నిర్మాత అశ్వినీ దత్త్ వివరించాడు.
ఓ రకంగా ఇది ప్రపంచ సినీ చరిత్రలోనే కొత్త రికార్డ్ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా కోసం 27 మంది రచయితలు పనిచేయడం ఒక ఎత్తు అయితే.. అందరి ఆలోచన తన పనితీరుగా మలుచుకుని తన సినిమాతో మ్యాజిక్ ను క్రియేట్ చేయడం రాఘవేంద్రరావు గొప్పతనం అంటూ చెప్పుకొచ్చాడు. ఇక వైజయంతి బ్యానర్స్ పై అశ్వినీ దత్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా 1990 మే 9న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయ్యే సమయం మండు వేసవికాలం. అందులోనూ అకాల తుఫాను.. ఊళ్ళకు, ఊళ్ళ తుఫాను దాటికి వణికిపోయాయి. అలాంటి సమయంలో ఇంత భారీ బడ్జెట్ సినిమాలో రిలీజ్ చేయడం.. అది సక్సెస్ సాధించడం సాధ్యం కాదని అంతా భావించారు. కానీ అలాంటి సిచువేషన్లోను ఈ సినిమా రిలీజై అద్భుతాన్ని సృష్టించింది.
మొదటి వారానికే బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించింది. తుఫాను సైతం లెక్కచేయకుండా జనం మూవీకి క్యూ కట్టారు. ఇక కొన్ని చోట్ల అయితే థియేటర్స్ లో వాన కురిసి నీళ్లు వచ్చేసిన కూడా.. సినిమా ప్రొజెక్షన్ మాత్రం ఆగలేదు. అంతలా జనం ఈ సినిమాను ప్రోత్సహించారు. ఇక మెగాస్టార్ మాస్ ఇమేజ్, శ్రీదేవి సౌందర్యం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇళయరాజా సంగీతం, కే, ఎస్, ప్రకాష్ సినిమాటోగ్రఫీ ఇప్పటికీ చెప్పుకునేంతగా నిలిచిపోయాయంటే అది సాధారణ విషయం కాదు. అలాంటి టఫ్ సిట్యుయేషన్లోను ఈ సినిమా ఏకంగా రూ.15 కోట్ల వసూళ్లను సాధించి అప్పటివరకు తెరకెక్కిన అన్ని సినిమాల్లో హైయెస్ట్ కలెక్షన్లను రాబట్టిన సినిమాగా రికార్డ్ సృష్టించింది.