తాజాగా తమిళ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హీరో కార్తీ ప్రధాన పాత్రలో నటిస్తున్న సర్దార్ 2 తాజాగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని సెట్స్ పైకి వచ్చింది. సోమవారం (జులై 15) నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో సెట్స్ లో బుధవారం రాత్రి అపశృతి నెలకొంది. ఈ సినిమా షూటింగ్ ఆశక్తిగా జరుగుతున్న క్రమంలో ఓ స్టంట్ సీక్వెల్ ను రూపొందిస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా స్టంట్కు సిద్దమైన ఎజుమలై ప్రమాదవశాత్తు అక్కడికక్కడే చనిపోయారు.
సుమారు 20 అడుగుల ఎత్తు నుంచి ఎజుమలై పడిపోగా.. ఆయన అక్కడికక్కడే తుది శ్వాస విడిచినట్లు సమాచారం. యూనిట్ సభ్యులు అ ఘటన జరిగాన క్షణాలోనే స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లిన ఫలితం లేకుండా పోయిందట. మృతదేహాన్ని పరీక్షించిన వైద్యులు ఛాతి లోపలి భాగంలో తీవ్ర గాయాలయ్యాయని.. దీంతో ఆయన మరణించాడు అంటూ చెప్పుకొచ్చారు. ఇక గతంలో తమిళ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలిచిన సర్దార్ సినిమాకు సీక్వెల్గా ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఈ క్రమంలో సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో షూటంగ్ శరవేగంగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కాగా ఇలాంటి నేపద్యంలో సెట్స్లో ఆపశృతి జరగటం.. తమ కో వర్కర్ను కోల్పోవడంగో యూనిట్ సభ్యులంతా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నూరు అవుతున్నారు.