గ్లామర్ రోల్‌లో నటించడంపై ఐశ్వర్య రాజేష్ షాకింగ్ కామెంట్స్.. అందుకే న‌టించ‌డం లేదంటూ..

టాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఒక సినిమా రిలీజ్ కాకముందే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.. భాషతో సంబంధం లేకుండా నటనకు మాత్రమే ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనదైన స్టైల్ లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. మొదట చిన్న చిన్న పాత్రల్లో నటించిన ఈ అమ్మ‌డు అంచలంచలుగా ఎదుగుతూ.. లేడి ఓరియంటెడ్‌ సినిమాల్లో నటించే రేంజ్‌కు ఎదిగింది. చిన్న వయసులోనే కక్కా ముట్టై సినిమాతో ఇద్దరు పిల్లల తల్లిగా కనిపించి ప్రేక్షకులు మెప్పించింది. ఈ సినిమా అమ్మడి కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారింది. అయితే సినీ ప్రపంచం అంటేనే రంగుల ప్రపంచం. ఇక్కడ హీరోయిన్లు గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం చాలా కామన్‌గా మారిపోయింది.

Aishwarya Rajesh

ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్‌గా రాణిస్తున్న ఎంతోమంది అందాల ఆరబోతులకు లిమిట్ లేకుండా కుర్రకారుకు హీటెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గ్లామరస్ రోల్స్‌కు అందాల ఆరబోతకు పూర్తి భిన్నంగా ఉండే అతి కొద్ది హీరోయిన్ల లిస్టులో ఐశ్వర్య రాజేష్ మొదటి వరుసలో ఉంటుంది. ఈ అమ్మ‌డు కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుని కథలను నటిస్తూ వరుస‌ సినిమా అవకాశాలను దక్కించుకుంటుంది. తెలుగు, కన్నడ భాషల్లో నటిస్తుండడంతో ప్రస్తుతం తమిళ్ సినిమా ఆఫర్లు తగ్గాయి. కాగా ఇటీవల విదేశాలకు వెళ్లిన ఈ స్టార్ బ్యూటీ అక్కడ నుంచి గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది. దీంతో ఐశ్వర్య రాజేష్ కూడా గ్లామర్ రోల్స్ నటించడానికి సిద్ధం అయిపోయింది అంటూ వార్తలు వినిపించాయి.

Aishwarya Rajesh

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గ్లామర్ పాత్రలో నటించమని నాకు చాలా అవకాశాలు వచ్చాయని.. నేను వాటికి అంగీకరించలేదంటూ చెప్పుకొచ్చింది. నాకు తగిన పాత్రలో నటించడమే నాకు ఇష్టమని.. గ్లామరస్‌గా నటించడం నాకు రాదు.. నచ్చదు.. అందుకే గ్లామర్ పాత్రల్లో నటించడానికి నేను ఇంట్రెస్ట్ చూపించడం లేదంటూ వివరించింది. ప్రస్తుతం ఐశ్వర్య చేసిన కామెంట్స్ నెటింట వైరల్ గా మారడంతో ట్రెడిషన్‌ను గౌరవిస్తూ.. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండే మీలాంటి హీరోయిన్లు చాలా రేర్ గా ఉంటారు అంటూ.. ఇప్పటి ఇండస్ట్రీలో ఇలాంటి హీరోయిన్ దొరకడం నిజంగా అదృష్టం అంటూ.. తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.