తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు కల్కి మానియ్యా నడుస్తుంది. రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి సక్సస్ సొంతం చేసుకున్నాడు. బాహుబలిలో తన నటనతో టాలీవుడ్ రేంజ్ పెంచేసిన ప్రభాస్.. ఇప్పుడు మరోసారి కల్కి తో తెలుగు మూవీని మరో మెట్టు పైకెక్కించాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈసినిమా బ్లాక్ బస్టర్ సక్సస్ అందుకుంది. అలాగే ఈ మూవీలో చాలా మంది స్టార్ నటులు కనిసించారు. బాలీవుడ్ స్టార్ అమితాబచ్చన్ ఈ మూవీలో అశ్వత్థామ పాత్రలో నటించి మెప్పించాడు. ఇక కమల్ హాసన్ ఈ మూవీలో సుప్రీమ్ యష్కిన్గా ఓ పవర్ఫుల్ నెగిటీవ్ రోల్ ప్లే చేశాడు. దీపికా పదుకొనె, దిశా పటాని హీరోయిన్లుగా మెప్పించారు.
ఇక ఈ సినిమా తొలి రోజే రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రబ్బటింది. తొలి రోజు రూ.191 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా మూడు రోజుల కలెక్షన్లతో మరింత దూసుకుపోతుంది. ప్రస్తుతం వెయ్యి కోట్ల దిశగా అడుగులు వేస్తుంది. ఇదిలా ఉంటే మహాభారతం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అమితాబ్ తను నటనతో మెప్పించాడు. అశ్వద్ధామ గా కనిపించిన అమితాబ్ గుడిలో తలదాచుకున్నట్లు సినిమాలో చూపించారు. కల్కి అవతారం పుట్టే సమయానికి అశ్వద్ధమా గుడి నుంచి బయటకు వస్తాడు అంటూ చూపించారు. అయితే ఆ గుడి నిజంగా ఉందని చాలామందికి తెలియదు. ఇంతకీ అది మరెక్కడ కాదు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నెల్లూరు జిల్లాలోనే ఉంది.
నెల్లూరు జిల్లా చేజర్ల.. పెరుమళ్ళపాడులో నాగేశ్వర స్వామి ఆలయమే ఆ దేవాలయం. దీన్నినే సినిమాలో అశ్వద్ధామ తలదాచుకున్న ఆలయంగా చూపించారు. కాకపోతే ఈ గుడిని కాశీలో ఉన్నట్లుగా క్రియేట్ చేశారు. పెన్నా నది తీరంలో ఈ గుడి బయటపడింది. 2020లో ఇసుక తవ్వకాల్లో ఈ గుడి బయటపడగా.. ఈ గుడిని పరశురాముడు నిర్మించారని ఇతిహాసాల్లో ఉంది. కాగ గతంలో వచ్చిన వరదల్లో ఈ గుడి ఇసుకలో మునిగిపోయింది. ప్రస్తుతం ఇదే గుడిని సినిమాలో చూపించడం వల్ల ఎక్కువగా పాపులర్ అవుతుంది. సోషల్ మీడియాలో ఈ గుడి గురించి ఎన్నో వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.