మెగా బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్. మొదటినుంచి వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు ఈ యంగ్ హీరో..ఈ క్రమంలో తను నటించిన సినిమాలతో సక్సెస్ లతో పాటు ఫ్లాప్లు ఎదుర్కొంటున్నా.. ఏమాత్రం వెనక్కు తగ్గకుండా సరికొత్త కథలతో ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపద్యంలో తేజ్ మరో కొత్త సినిమా కోసం రంగంలోకి దిగారు.
ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పాన్ ఇండియా స్థాయిలో ఈ భారీ ప్రాజెక్ట్ రూపొందుతుంది. ఈ సినిమాతో రోహిత్ కెపి అనే కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. కే. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా పిరియాడికల్ యాక్షన్ డ్రామగా తెరకెక్కనుందని సమాచారం. ఈ సినిమా ప్రత్యేక పోస్టర్తో శుక్రవారం అఫీషియల్గా అనౌన్స్ చేశారు మేకర్స్. ఇక చివరిగా విరూపాక్ష, బ్రో సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్న సాయి ధరంతేజ్ ఈ మూవీలో ఓ పవర్ఫుల్ రోల్ లో కనిపించనున్నాడు.
ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఓ భారీ సెట్ లో ఇప్పటికే సినిమా షూటింగ్ మొదలైంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషలో సినిమా ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. ఇక సరికొత్త కదా అంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు మొదలయ్యాయి. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని వివరించారు ప్రొడ్యూసర్లు.