టాలీవుడ్ పవర్ స్టార్ పవన్.. పవర్ఫుల్ పొలిటిషన్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పగ్గాలని చేపట్టిన పవన్.. నేడు వారాహి అమ్మవారి దీక్షను మొదలుపెట్టాడు. అంటే జూన్ 26 తో ఈ దీక్ష ప్రారంభమైంది. ఇంకా 11 రోజులు నిరంతరాయంగా ఈ దీక్షను కొనసాగించనున్నాడు పవర్ స్టార్. ఈ దీక్షలో కేవలం పాలు, పండ్లు, ద్రవపదార్థాలను మాత్రమే ఈ 11 రోజులు తీసుకుంటాడు. కాగా ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ చేసిన చిన్న తప్పు నెటింట తెగ వైరల్ అవుతుంది.
పవన్ నిండుగా అమ్మవారి బట్టలు ధరించి.. చెప్పులు వేసుకుని దర్శనం ఇవ్వడం నెటింట సంచలనంగా మారింది. ఎంతో పద్ధతిగా నుదుటిని బొట్టు పసుపు రంగు అమ్మవారి బట్టలతో కనిపించిన పవర్ స్టార్ ను చూసి అంతా తెగ మురిసిపోయారు. అయితే ఈ దీక్షలో పవన్ కళ్యాణ్ చెప్పులు వేసుకుని ఉన్నా ఓ ఫోటోను కాంట్రవర్షియల్ బ్యూటీ శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ.. అతనిపై సంచలన కామెంట్ చేసింది.
బీజేపీని మెప్పించడం కోసం ఈ చెప్పులతో దీక్షలు అవసరమా.. వాటే హిందూ ఫాలోవర్ అంటూ వెటకారంగా పగలబడి నవ్వే ఇమేజీలను షేర్ చేసుకుంది శ్రీరెడ్డి. ప్రస్తుతం శ్రీరెడ్డి చేసిన పోస్ట్ నెటింట వైరల్ అవ్వడంతో పవర్ స్టార్ పిక్స్ చూసి అంత ఆశ్చర్యపోతున్నారు. నిజంగానే ఇంత కఠినమైన దీక్షను చేపట్టిన ఆయనకు చెప్పులు వేసుకోకూడదు అని తెలియదా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.