ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తన కెరీర్ లో 109 సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. కొల్లి బాబి డైరెక్షన్లో సాలిడ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుంచే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో బాలయ్య కొంతకాలం సినిమాకు బ్రేక్ ఇచ్చి పొలిటికల్ ప్రచారాల్లో బిజీగా గడిపిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరోసారి సెట్లో పాల్గొన్న బాలకృష్ణ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తిచేసి.. సినిమాను త్వరగా ప్రేక్షకుల ముందుకు రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారట మేకర్స్.
అయితే ఇప్పటివరకు ఈ సినిమా కాస్టింగ్ వివరాలు ఏవి బయటకు రాలేదు. కేవలం బాబీ డియోల్, ఊర్వసి రౌతెలా పేర్లు మాత్రమే సినిమాలో నటిస్తున్నారంటూ వినిపించాయి. అయితే అసలు బాలయ్య సరసన నటించే మెయిన్ హీరోయిన్ ఎవరు అనేది మాత్రం ఇప్పటివరకు మేకర్స్ రిలీజ్ చేయలేదు. కాగా తాజాగా ఆ హీరోయిన్ ఎవరు అనేది రివిల్ అయినట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది.
ఈ సినిమాలో హీరోయిన్గా మరెవరో కాదు అఖండతో బాలయ్య సరసన నటించి బ్లాక్ బస్టర్ కొట్టిన ప్రగ్యా జైష్వాల్ని సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరి కాంబోలోనే సినిమా వస్తుందంటూ ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు. కానీ.. తాజాగా ప్రగ్యా జైస్వాల్ తన సోషల్ మీడియా వేదికగా.. ఇన్స్టాల్ స్టోరీగా పెట్టిన ఒక పిక్ బాలయ్య 109 మూవీ షూటింగ్ సెట్స్ తో మ్యాచ్ కావడంతో ప్రగ్యానే ఈ సినిమాకు హీరోయిన్ అన్నట్లు ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. మరి దీనిలో నిజం ఎంత తెలియాలంటే మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకు వేచి చూడాల్సిందే.