చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద స్టార్ బడా హీరో . చిరంజీవి హీరోగా అవ్వడానికి మెయిన్ రీజన్ ఆయన కల్చర్ .. ఆయన బిహేవియర్ ఆయన పద్ధతులే .. అందరిలా ఒకటి రెండు హిట్లు కొట్టగానే విర్రవీగి మీసాలు మెలివేయడం.. తొడలు కొట్టడం లాంటివి చిరంజీవి చేయడు. చాలా పద్ధతిగల మనిషి ..చాలా సాఫ్ట్ నేచర్ కలమనిషి .. తాను అనుకున్న పద్ధతిని సిద్ధాంతాలని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాడు. ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవి ఒక్కరంటే ఒక్కరిపై కూడా కోపడిన సందర్భాలు మనం చూడలేదు.
ఆయన ఇండస్ట్రీకి వచ్చి దశాబ్ద కాలాలు దాటిపోతున్నాయి . ఇప్పటికి ఆయన అంటే జనాలలో ఓ విపరీతమైన క్రేజ్ అభిమానమే చూస్తాం. మరీ ముఖ్యంగా 1980వ దశకంలో చిరంజీవి – యండమూరి – ఏ కోదండరామిరెడ్డి కె.ఎస్.రామారావుల కాంబినేషన్ కేక. వీళ్ళ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ . వీళ్లని బీట్ చేయడం ఎవరి తరం కాలేదు. అయితే మన పెద్ద వాళ్ళు చెప్పినట్లు ఎంతటి ప్రాణ స్నేహితులైన వాళ్ళ మధ్య గొడవలు రావడం కామన్. అలాగే చిరంజీవి యండమూరి మధ్య గొడవలు వచ్చాయి.
యండమూరి వీరేంద్రనాథ్ కు చిరంజీవికు మధ్య గొడవలు ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఒకానొక ఈవెంట్లో యండమూరి వీరేంద్రనాథ్ చరణ్ గురించి చేసిన కామెంట్స్ అప్పట్లో మెగా ఫాన్స్ కు మండిచ్చాయి . “ఆయన హీరోగా చేయడానికి సురేఖ చాలా కష్టపడింది అంటూ వీరేంద్రనాథ్ చేసిన కామెంట్స్ అప్పట్లో మెగా ఫ్యాన్స్ కు బాగా కోపం తెప్పించాయి”. అయితే ఆ తర్వాత అదే ఈవెంట్లో దేవి శ్రీ ప్రసాద్ ఓ రేంజ్ లో పొగిడేయడం స్వశక్తితో పైకి వచ్చాడని చెప్పడం ఇంకా మెగా అభిమానులను రెచ్చగొట్టినట్లయింది.
కాగా ఈ వ్యాఖ్యలకు కౌంటర్గా నాగబాబు మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమా ఈవెంట్ లో ఇచ్చి పడేసాడు. “ఓ మూర్ఖుడు అంటూ ఘాటు పదాజాలంతో ఫైర్ అయిపోయారు”. పేరు చెప్పకుండానే తాను చెప్పాల్సిన విషయాన్ని ఓపెన్ గా చెప్పేసాడు . దీనిపై మళ్లీ వీరేంద్రనాథ్ స్పందించడం గమనార్హం. ఎప్పుడో చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు కౌంటర్ ఇవ్వడం అనేది సమంజసం కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు . అయితే ఆ తర్వాత ఓ ఈవెంట్లో చిరంజీవి సైతం దీని గురించి ప్రస్తావించారు . “నా భార్యను ఏక వచనంతో పిలవడం నాకు నచ్చలేదు “అంటూ తన మనసులోని మాటను బయట పెట్టాడు . ఆ తర్వాత ఈ ఇష్యూస్ సర్ధుమణిగిపోయింది..!!