బుల్లితెర బోల్డ్ యాంకరమ్మ అనసూయ భరద్వాజ్కు పరిచయాలు అవసరం లేదు. మొదట జబర్దస్త్ ద్వారా యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అమ్మడు.. తర్వాత పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది. తర్వాత జబర్దస్త్ కు చెక్ పెట్టి కొంతకాలం బుల్లితెరపై ఎలాంటి షోలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా కేవలం నట్టిగా కొనసాగింది. ఇక తాజాగా మరోసారి బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది అనసూయ. అయితే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు.. తన సినిమాలకు, పర్సనల్ విషయాలకు సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ ఉంటుంది.
ఏ విషయం పైన అయినా ముక్కు సూటిగా సమాధానం చెప్తూ పలు సందర్భాల్లో ట్రోలింగ్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటుంది. అలా తాజాగా మరోసారి విమ్మర్శలకు గురైన అనసూయ.. సోషల్ మీడియా వేదికగా బ్యాడ్ కామెంట్స్ చేసిన నెటిజన్లకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. అయితే ఈ వివాదానికి కారణం ఏంటి అనుకుంటున్నారా.. స్టార్ మాలో కిర్రాక్ బాయ్స్.. కిలాడీ గర్ల్స్.. షోలో అనసూయ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో ఓ చాలెంజ్లో భాగంగా.. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తో కలిసి అనసూయ కూడా తన జాకెట్ తీసి ఆయన చేసినట్లు చేస్తుంది.
ఈ ఫోటో నెట్టింటి తెగ వైరల్ గా మారడంతో పలు విమర్శలను ఎదుర్కొన్న అనసూయ.. తాజాగా ఓ నెటిజన్ చేసిన కామెంట్ కు రియాక్ట్ అయింది. కాలం మారడంతో పాటు అభిమానుల టేస్ట్ కూడా మారుతుంది. మేము వినోద రంగంలో ఉన్నప్పుడు వాటికి తగ్గట్టుగా నడుచుకోవాల్సి ఉంటుంది. మీ ప్రతాపం స్మాల్ స్క్రీన్ పై పనిచేస్తున్న మాపై కామెంట్స్ చేయడానికి మాత్రమే పరిమితమైంది. బిగ్ స్క్రీన్ పై ఎన్నో అసభ్యకరమైన సంఘటనలు వస్తున్న.. మీరు సినిమాలను బ్లాక్ బస్టర్ చేస్తారు. షో అంతా చూసేదాకా ఆగకుండానే జడ్జిమెంట్ ఇచ్చేస్తారు అంటూ ఫైర్ అయ్యింది. ప్రస్తుతం అనసూయ చేసిన కామెంట్స్ నెటింట వైరల్ గా మారాయి.