సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫేక్ వార్తలు ఎక్కువైపోతున్నాయి. కొన్ని ఫేక్ వార్తలు ఎటువంటి నష్టం క్రియేట్ చేయకపోయినా కొన్ని ఫేక్ వార్తలు మాత్రం సినీ మేకర్స్ కు భారీ నష్టాలు క్రియేట్ చేస్తాయి. అయితే తాజాగా రాజమౌళి – మహేష్ బాబు కాంబోలో తెరకెక్కే సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ సినీ ఇండస్ట్రీలోని జనాలకు షాకింగ్ కి గురయ్యేలా చేసింది. ఎప్పుడు కూడా ఈ సినిమాలో ఆ హీరోయిన్ వాళ్లు ..వీళ్లు అంటూ ప్రచారం జరుగుతూ ఉంటుంది .
కానీ రాజమౌళి – మహేష్ బాబు సినిమా విషయంలో కూసింత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సోషల్ మీడియా స్టార్స్ . రీసెంట్గా ఇంగ్లీష్ వెబ్సైట్ ఈ సినిమాకు కాస్టింగ్ డైరెక్టర్ వీరెన్ స్వామి పనిచేస్తున్నట్లు వార్తలు రాశారు . దీనిపై అధికారికంగా స్పందించింది చిత్ర యూనిట్ . చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ దుర్గా ఆర్ట్స్ నుంచి తాజాగా ఓ అధికారిక లేక విడుదల చేశారు . “ఎస్ఎస్ రాజమౌళి – మహేష్ బాబు కాంబోలో రాబోయే సినిమా కోసం కాస్టింగ్ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు”.
” అయితే వైరల్ అవుతున్న సోషల్ మీడియాలోని వార్త లో ఎటువంటి నిజం లేదు అని అది స్పష్టం చేసేందుకే ఈ లేఖను విడుదల చేస్తున్నామంటూ చెప్పుకొచ్చారు . అంతేకాదు ఈ సినిమా విషయంలో రాజమౌళి సైతం కఠిన నిర్ణయం తీసుకున్నారట. ఈ సినిమాపై త్వరలోనే నటీనటులకు సంబంధించి అఫీషియల్ ప్రకటన చేయబోతున్నారట. ఫేక్ వార్తల నేపధ్యంలోనే కోపంతోనే రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది . కాగా ఈ సినిమాలో హీరోయిన్గా మొత్తం ముగ్గురు బ్యూటీస్ నటిస్తున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. చూద్దాం త్వరలోనే పూజా కార్యక్రమాలు జరుపుకోబోతున్న ఈ సినిమా విషయంలో రాజమౌళి ఇంకా ఎంత పకడ్బందీగా ప్లాన్స్ వేస్తారు అనేది చూడాలి. అయితే రాజమౌళి తీసుకున్న నిర్ణయంతో “ఇక నోర్లు మూయండి రా”.. ఒక్కోక్కడికి ఇచ్చిపడేసేచ్రేంజ్ లో రాజమౌళి అప్డేట్స్ ఇవ్వబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు..!!