కీర్తి సురేష్ ..టాలీవుడ్ ఇండస్ట్రీ మహానటిగా బాగా పాపులారిటీ సంపాదించుకుంది . అంతేనా కీర్తి సురేష్ ఏ రేంజ్ లో తెలుగు జనాలను ఆకట్టుకుందో కూడా మనకు తెలిసిందే. భోలా శంకర్ సినిమా తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది . టాలీవుడ్ కన్నా బాలీవుడ్ బెటర్ అంటూ బాలీవుడ్ లో అడుగు పెట్టింది . అన్న విధంగానే బాలీవుడ్ కి వెళ్ళాక హాట్ హాట్ రోల్స్ చేయడానికి నిర్ణయించుకుంది . బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళాక కీర్తి సురేష్ ఎలాంటి ఫోటోషూట్స్ చేస్తుందో కూడా మనకు తెలిసిందే .
గ్లామర్ డోస్ పెంచేస్తూ వచ్చింది. వరుణ్ ధావన్ తో ఒక సినిమాలో నటిస్తున్న కీర్తి సురేష్ ఇప్పుడు చేతిలో మూడు బడా ప్రాజెక్ట్స్ పట్టుకున్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి . తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కీర్తి సురేష్ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న అక్షయ్ కుమార్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుందట. వయసులో అఖయ్ కుమార్ కి కీర్తి కి మధ్య ఎంత తేడా ఉందో మనకు తెలుసు.
ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది . ప్రియదర్శన్ లో హిందీ హారర్ కామెడీ మూవీ చేస్తున్నారు . ఇందులో హీరోయిన్గా కీర్తి సురేష్ పేరు వినిపిస్తుంది . ఆమెను మేకర్స్ అప్రోచ్ అవ్వగా.. ఆమె ఓకే చేశారట. ఇప్పటికే కీర్తి సురేష్ బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది . తమిళంలో కూడా కీర్తి సురేష్ బిజీగా ఉంది ..”రఘు తాత ..రివాల్వర్ రీటా ..కన్నీ వేడి వంటి సినిమాలలో నటిస్తుంది”. ఈ సినిమాలు హిట్ అయితే కీతి రేంజ్ మారిపోతుంది..!!