ఒకప్పటి బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ కు తెలుగు ప్రేక్షకుల్లో కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దివంగత నటి శ్రీదేవిని ప్రేమించడం.. ఆమెను పెళ్లి చేసుకోవడం ఒకప్పుడు సంచలనంగా మారిన అంశాలన్న సంగతి తెలిసిందే. ఇక శ్రీదేవి మరణంతో కృంగిపోయిన బోనీ కపూర్.. ఒక ఇంటర్వ్యూలో కూడా ఆమె గురించి మాట్లాడకుండా ఉండలేడు. బోనీకపూర్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన కొత్త సినిమా మైదాన్ ను ప్రమోట్ చేస్తున్న క్రమంలో.. శ్రీదేవితో తన పెళ్లి గురించి తన మొదటి భార్య, కుమారుడు అర్జున్ కపూర్ కోపం గురించి వివరించాడు. బోనికప్పూర్ 1983లో మోనా శౌరీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ జంట 13 సంవత్సరాలు కలిసి ఉన్నారు. అర్జున్ కపూర్, అన్షుల్లా కపూర్ అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే 1996లో బోనీకపూర్.. శ్రీదేవిని పెళ్ళాడేందుకు మోనా శైరిని వదిలేసాడు. అయితే ఆయన తీసుకున్న ఆ నిర్ణయం కొడుకు అర్జున్ కపూర్ ఎమోషన్స్ ను బాగా ప్రభావితం చేసిందని.. బోనికపూర్ చెప్పుకొచ్చాడు. తన కొడుకు చాలా సంవత్సరాలుగా తనపై కోపంగానే ఉంటున్నాడని.. బోనికపూర్ వెల్లడించాడు. నేను అతని ఎమోషన్స్ ను అర్థం చేసుకోగలను.. అవి ఎందుకు.. ఎక్కడ నుంచి వస్తాయో తెలుసు. అయితే దాని గురించి నేను కూడా చాలా సార్లు గిల్టీగా ఫీల్ అయ్యా. కానీ నాకు నిజాయితీగా సపోర్ట్ చేసింది మోనా శౌరి.. ఆమె నిజంగా బంగారం.
శ్రీదేవి పట్ల నాకున్న ఫీలింగ్స్ ని మోనా ఒక్కటే అర్థం చేసుకుందని బోనికపూర్ వివరించాడు. మోనాకి శ్రీ తో మంచి బాండ్ ఉందని.. మా పెళ్ళికి ముందు శ్రీదేవిని ఆమె ఇంటికి కూడా పిలిచేదన్ని.. శ్రీదేవి మా ఇంట్లోనే ఉండేది అంటూ వివరించాడు. మా అమ్మ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారని చెప్పుకొచ్చాడు. శ్రీదేవిని నా చేతికి రాఖీ కట్టమని ఒకసారి అడిగానని.. బోనీ కపూర్ వివరించాడు. ఈ సంఘటన జరిగిన ఐదేళ్లకే మా ఇద్దరి పెళ్లి జరిగిందని చెప్పుకొచ్చాడు. ఇక 2018లో శ్రీదేవి మరణించిన సంగతి తెలిసిందే. ఆ మరణం గురించి నేను ఇంకా మాట్లాడలేనని చెప్పుకొచ్చాడు. ఆమె లేకుండా ఎలా ఉండాలో నాకు తెలియదు అంటూ బోనీకపూర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.