చిరు, బాలయ్య మధ్యలో ఉన్న ఈ పాపను గుర్తుపట్టారా.. మోస్ట్ ఫేమస్ టాలీవుడ్ బ్యూటీ..?!

చిరంజీవి, బాలయ్యకు టాలీవుడ్ లో ఉన్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తున్న ఈ ఇద్దరు స్టార్ హీరోస్.. తమ సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర అప్పుడప్పుడు పోటీ పడుతుంటారు. ఇక ఈ ఇద్దరు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే చాలు వారి అభిమానుల్లో సందడి వేరే లెవెల్ లో ఉంటుంది. అయితే సినిమాలు పరంగా వీరిద్దరి మధ్యన గట్టి పోటీ ఉన్నప్పటికీ.. రియల్ లైఫ్ లో మాత్రం ఇద్దరూ మంచి స్నేహితులు.

ఇక అసలు విషయం ఏంటంటే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీస్, హీరో, హీరోల చిన్ననాటి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఈ పై ఫోటో కూడా ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంతకీ ఈ పై ఫోటో ఫోటోలో చిరంజీవి, బాలకృష్ణ మధ్యలో ఉన్న ఆ చిన్ని పాప ఎవరో గుర్తుపట్టారా.. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ ఫేమస్ లేడీ. తెలుగు ప్రేక్షకుల్లో ఆమె తెలియని వారు ఉంటారు అనడంలో అతిశయోక్తి లేదు. ఇంతకీ ఆమె ఎవరో కాదు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ కుమార్తె ప్రియాంక దత్. స్వప్న దత్ కూడా తండ్రి మార్గంలోనే నడుస్తూ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బాలు సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించింది.

ప్రియాంకదత్ 3 ఏంజెల్స్ స్టూడియో ఏర్పాటు చేసి వరుస సినిమాలను నిర్మిస్తున్నారు. బాణం, ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి లాంటి ఎన్నో సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ప్రియాంకదత్.. యాదోం కి బ‌రత్ అనే షార్ట్ ఫిలిం ను నిర్మించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా 2013 కన్నెస్ ఫిలిం ఫెస్టివల్ లో సెలెక్ట్ అయింది. ఇక ప్రియాంక దత్ భర్త.. ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రస్తుతం ప్రభాస్‌తో కల్కి లాంటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.