వర్షం సినిమాలో త్రిష క్యారెక్టర్ ను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..!

రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలని ఎలా రూల్ చేస్తున్నాడో చూస్తున్నాం మరి తన యంగ్ ఎజ్ లో చేసిన సినిమాల్లో పలు భారీ హిట్స్ కూడా ఉన్నాయి. ఈ చిత్రంలో దర్శకుడు శోభన్ తరకెక్కించిన చిత్రం” వర్షం” కూడా ఒకటి.

మరి త్రిష హీరోయిన్ గా గోపీచంద్ విలన్ గా నటించిన ఈ సినిమా ప్రభాస్ మార్కెట్ ని కూడ‌ ఓ రేంజ్ లో పెంచగా లేటేస్ట్ గా అయితే ఈ సినిమా విషయంలో ఓ ఆసక్తికర నిజం తెలిసింది. ఈ సినిమాలో ప్రభాస్ సరుసున త్రిష నటించిన వారిద్దరి కెమిస్ట్రి సినిమాల్లో పెద్ద హైలైట్ గా నిలిచింది. అయితే అసలు ఈ సినిమాకి మొదట ప్రభాస్ సరసన హీరోయిన్గా అనుకున్నది త్రిషాని కాదంట.

ఆమె ప్లేస్ లో మొదట ఇప్పటి యంగ్ హీరోయిన్ అదితి అగర్వాల్ నీ అనుకున్నారంట. అల్లు అర్జున్తో “గంగోత్రి ” సినిమాలో మెరిసిన ఈ నటిని మొదటిగా అనుకోగా తర్వాత పలు కారణాల చేత ఆమె స్థానంలో త్రిష చేరింది. ఇక తర్వాత సినిమా వచ్చి ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన సెన్సేషనల్ మ్యూజిక్ ఆల్బమ్ ఈ సినిమాని మరో స్థాయిలో నిలిపింది. ఈ సినిమాకి ఏం ఎస్ రాజు నిర్మాణం వహించారు.