అంబానీ కొడుకు పెళ్లిలో కత్రినా ఎందుకు పదేపదే అలా చేసింది..? ఫ్యాన్స్ కి కొత్త డౌట్లు..!

ప్రజెంట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒకే ఒక్క న్యూస్ బాగా వైరల్ గా మారింది. అదే అనంత్ అంబానీ వెడ్డింగ్. భారతదేశ ప్రనుఖ వ్యాపారవేత్త .. కుబేరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహం దేశవ్యాప్తంగా ఎంత హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుందో మనకు తెలిసిందే. మరి ముఖ్యంగా కేవలం ప్రీ వెడ్డింగ్ వేడుకలకే దాదాపు 1,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు అంటూ ఇంటర్నేషనల్ మీడియాలో కూడా వార్తలు వినిపిస్తూ ఉండడంతో ఈ న్యూస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది.

కేవలం ఈ వేడుకకు సినీ స్టార్ సెలబ్రిటీసే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు.. కుబేరులు ఇంకా ఇంకా ప్రముఖ వ్యక్తులు సందడి చేశారు . ఆశ్చర్యం ఏంటంటే ఎప్పుడు ఏ ఫంక్షన్ కి రాణి ఫేస్బుక్ అధినేత మార్కు జూకర్ బర్గ్.. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్.. ఈ ఫంక్షన్ కి హాజరు కావడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది . అయితే చాలామంది సెలబ్రిటీస్ ఈ వేడుకకు హాజరైన అందరి కళ్ళు కత్రినా కైఫ్ మీదే పడ్డాయి .

బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న కత్రినా కైఫ్ ..అనంత్ అంబానీ ఫ్రీ వెడ్డింగ్ లో హైలెట్గా నిలిచింది . చాలా ట్రెడిషనల్ గా ట్రెండీగా కనిపిస్తూ వచ్చింది. అయితే ఎక్కడ చూసినా సరే కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ తోనే ఉండింది. వేరే ఎవరితో మింగిల్ కాలేదు.. దానికి కారణం ఏంటి అనేది కూడా జనాలు గెస్ చేయలేకపోతున్నారు. జనరల్ గా కత్రినా కైఫ్ ఫంక్షన్స్ అంటే అందరితో కలివిడిగా ఉంటుంది ..

కానీ కత్రినా కైఫ్ ఎందుకో ఈ ఫంక్షన్ లో మాత్రం ముభావంగా.. ఫోటోలకి స్మైల్ ఇవ్వాలి అంటే ఇవ్వాలి అన్న విధంగా ఇచ్చింది . అంతేకాదు తన ఫ్రెండ్స్ అక్కడే ఉన్నా కూడా పట్టించుకోకుండా సింగిల్ గా విక్కీ కౌశల్ తో మాత్రమే వెడ్డింగ్ ఎంజాయ్ చేసింది . దీనితో ఫ్యాన్స్ కి కొత్త డౌట్లు మొదలయ్యాయి. కత్రినా కైఫ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ ప్రముఖులతో విభేదాలు వచ్చాయా ..? ఆమె ఫ్రెండ్స్ అక్కడ ఉన్నా కూడా చాలా ముభావంగా ఉండడం అభిమానులకి ఇప్పుడు రకరకాల డౌట్లు క్రియేట్ చేస్తుంది . అసలు కత్రినా ఎందుకు అలా ఉంది..? అనేది ఎవరికీ అర్థం కావడం లేదు . ప్రజెంట్ న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!