“20 నిమిషాల ఆనందం కోసం కోట్లు ఇస్తున్నారు”.. నాగార్జున సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పాత తాలూకా విషయాలు ఎలా వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా కొంతమంది ఆకుతాయిలు స్టార్ సెలబ్రెటీస్ కి సంబంధించిన గతం తాలూకా ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియోలను పదేపదే నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు. రీసెంట్గా నాగార్జున గతంలో మాట్లాడిన మాటల తాలూకా వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు . రీసెంట్ గా భారత దిగ్గజ వ్యాపారవేత్త కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడి వివాహం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది . కేవలం ప్రీ వెడ్డింగ్ వేడుకలకే వెయ్యి కోట్లు ఖర్చుపెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి .

దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఈ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు సన్నిహితులే కాదు ఇండియాలోని టాప్ సెలబ్రిటీస్ ..ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు కూడా వచ్చి సందడి చేశారు . మరి ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్ అందరూ వచ్చి ఈ వేడుకను గ్రాండ్ సక్సెస్ చేశారు . దీనితో సోషల్ మీడియాలో ముఖేశ్ అంబానీ స్టార్ సెలబ్రిటీస్ కి కోట్లు ఇచ్చి మరి తన కొడుకు పెళ్లిలో చిందులు వేయించాడు అన్న కామెంట్స్ చేశారు .

అయితే గతంలో నాగార్జున ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” కొందరు స్టార్స్ పెళ్ళికి గెస్ట్లుగా రమ్మంటూ 20 నుంచి 30 నిమిషాలు టైం స్పెండ్ చేస్తే కోట్లు ఇస్తామంటూ ఆఫర్ ఇస్తున్నారు “అని పరోక్షంగా వాళ్లపై మండిపడ్డారు . దానికి సంబంధించిన వార్తలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ముకేశ్ అంబానీ కొడుకు పెళ్లికి చరణ్ ఉపాసనలు కూడా వెళ్లడం ఇక్కడ హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వీళ్ళు మాత్రమే వెళ్లడం అభిమానులకి కొత్త డౌట్లు మొదలయ్యేలా చేసింది. ప్రజెంట్ నాగార్జున మాట్లాడిన మాటలు నెట్టింట వెరీ వెరీ హాట్ టాపిక్ గా వైరల్ అవుతున్నాయ్..!