వాట్.. అల్లు అర్జున్ సుకుమార్ మూడు గంటల పాటు ఎండలో నిలబెట్టాడా.. పుష్ప 2 ఆలస్యానికి కారణం అదేనా..?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పుష్ప 2లో తన నటనకు గాను నేషనల్ అవార్డును దక్కించుకొని.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బన్నీ ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న పుష్ప 2 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా.. ఎప్పుడెప్పుడు థియేటర్లకు వెళ్లి చూద్దాం.. అంటూ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ నెటింట‌ వైరల్ గా మారింది. బిగ్ బాస్ ఫేమ్ దివి కూడా పుష్ప 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసింది. ఇందులో దివి వాద్త్యా మాట్లాడుతూ ఇంటర్స్టింగ్ విషయాల‌న్ని షేర్ చేసుకుంది. దివి మాట్లాడుతూ ఆమె పాత్రకు పుష్ప 2లో కాస్త నడివి ఉందని.. కొంచెం సమయం ఆమె కనిపిస్తుంది అంటూ వివరించింది. గత ఏడది వేర్ ఈజ్‌ పుష్ప.. అంటూ ఓ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. దీంట్లో టీవీ రిపోర్టర్‌గా కాసేపు మెరిసింది. కాగా ఈ ప్రోమోకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే దీన్ని మాట్లాడుతూ పుష్పా 2 నాకు కాస్త నేను న్యూస్ రిపోర్టర్ రోల్‌లో న‌టించాన‌ని ఆ రోల్‌ చేయడం అంత సులువు కాదని వివరించింది.

కొందరు నటులతో పాటు రియల్ న్యూస్ రిపోర్టర్స్ తో కొన్ని సన్నివేశాలు రూపొందించారని వివరించింది. ఒకసారి అందరూ నన్ను తోసుకుంటూ వెళ్లిపోయారని. ఆ క్రమంలో నేను కింద పడిపోయాను అంటూ చెప్పుకొచ్చింది. సుకుమార్ చాలా పర్ఫెక్షనిస్ట్ తనకు అనుకున్నట్లు సీన్ వచ్చేవరకు ఎన్ని టేక్స్ అయినా తీస్తూనే ఉంటారు.. పుష్ప 2లో ప్రతి షార్ట్ కి ఆయన 5 నుంచి 35 టేక్స్ వరకు తీసి ఉంటారు అంటూ ఆమె వివరించింది. నటులు ఎటు నుంచి రావాలి.. వారు ఎంట్రీ తో ఎలా చూడాలి.. అనే ప్రతి విషయాన్ని కూడా ఆయన చాలా జాగ్రత్తగా గ్రహిస్తారని.. ఆలస్యం ఎంతైనా పర్వాలేదు కానీ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చింది.

అలా ఓ సీన్ కోసం అల్లు అర్జున్ ని ఏకంగా 3 గంటలు ఎండలో ఉంచారని.. దాదాపు 40 టేక్స్ తీశారని.. తాను అనుకున్నది అనుకున్నట్లు తీయాలనే ఉద్దేశ్యంతోనే ఆయన అలా చేశారని వివరించింది. ఆయన అంత పర్ఫెక్షనిస్ట్ కాబట్టే పుష్ప 2కి ఆలస్యం అవుతుందని.. పుష్ప 2 అందరి అంచనాలను మించి ఉండబోతుందని చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన నటించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.300 కోట్లు బడ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.