అప్పుడు ఎన్టీఆర్ తో..ఇప్పుడు చరణ్ తో.. అదే కలర్ శారీ కట్టుకున్న జాన్వీ..రీజన్ ఏంటో తెలుసా..?

జాన్వి కపూర్ .. ప్రెసెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతున్న పేరు . అమ్మడు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ దేవర సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి డెబ్యూ ఇవ్వబోతుంది. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే చరణ్ తో అదిరిపోయే ఆఫర్ ని అందుకునింది .

త్వరలోనే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా సెలెక్ట్ అయింది . రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి . ఈ వేడుకకు జాన్వికపూర్ గ్రీన్ కలర్ శారీలో వచ్చింది. గ్రీన్ కలర్ శారీలో చాలా ఆకర్షణీయంగా కనిపించింది . అచ్చం కుందనపు బొమ్మల ఈవెంట్ కి హైలెట్ గా మారింది.

కాగా గతంలో ఎన్టీఆర్ తో నటించే దేవర సినిమా పూజా కార్యక్రమాలలోనూ జాన్వి కపూర్ గ్రీన్ కలర్ సారీనే కట్టుకొచ్చింది . దీంతో ఆమె గ్రీన్ కలర్ సారీ మాత్రమే ఎందుకు కట్టుకొస్తుంది అన్న విషయం వైరల్ గా మారింది . జాన్వి ఫేవరెట్ కలర్ గ్రీన్ అని పైగా జాన్వి కపూర్ తల్లి శ్రీదేవి కూడా అదే గ్రీన్ కలర్ ని ఎక్కువగా లైక్ చేస్తుంది అని.. ఆ కారణంగానే తన లైఫ్ లో ఇంపార్టెంట్ విషయాలకు సంబంధించిన ఈవెంట్స్ లో జాన్వికపూర్ గ్రీన్ కలర్ సారీనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తుందట . మరీ ముఖ్యంగా తిరుమల కి వెళ్లేటప్పుడు కూడా ఆమె గ్రీన్ కలర్ పట్టు పావడాని ధరిస్తూ ఉండడం గమనార్హం. ఇదే విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!!