టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ డైరెక్షన్లో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. అలాగే మరో కీలక పాత్ర కోసం మరాఠీ నటి శృతి మార్తే నటిస్తుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి మేకర్స్కు ఏవో ఒక తలనొప్పులు ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. ఇటీవల ఎన్టీఆర్ లుక్ తాలూకా పిక్స్, వీడియోస్ నెటింట వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో కీలక అప్డేట్ రివీల్ అయిపోయింది. ఈ సినిమాలో కీలక పాత్రకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని నటి శృతి మార్తే రివిల్ చేయడంతో మేకర్స్ లబోదిబో మంటున్నారు.
ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న తరువాత తెరకెక్కుతున్న మొదటి సినిమా దేవర కావడంతో ఈ సినిమా పై మంచిహైప్ నెలకొంది. కొరటాల శివ డైరెక్షన్లో రెండు పార్ట్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 10న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం సరవేగంగా షూటింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో యూనిట్కు లీక్ల బెడద ఎక్కువ అవడంతో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం దేవర షూటింగ్ గోవాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ షూట్లో జాన్వితో డ్యూయెట్, కొన్ని యాక్షన్ సిన్నివేశాలు రూపొందుతున్నాయి. గోవాలో సముద్రం దగ్గర షూట్ జరుగుతున్న నేపథ్యంలో.. ఎన్టీఆర్ సముద్రంలో నుంచి తన పాత్రకు తగ్గట్టుగా నడుచుకుంటూ వస్తున్న వీడియో వైరల్గా మారింది. చాలా దూరం చెట్టు మీద నుంచి ఎవరో వీడియోను షూట్ చేసి లీక్ చేశారు.
ఆ వీడియోని అభిమానులు తెగ ట్రెండ్ చేస్తున్నారు. దీంతో యూనిట్ చేసేది ఏమీ లేక ఎన్టీఆర్ పిక్స్ ను రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే దేవర సినిమాలో తాను నటిస్తున్నట్టు మరాఠీ బ్యూటీ శృతి అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. దేవర సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో నేను దేవరకు భార్యగా నటిస్తున్నాను.. ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది శృతి. ఇప్పటికే ఈ సినిమాలో తంగం పాత్రలో జన్వి నటిస్తున్న సంగతి తెలిసిందే. శృతి రెండో హీరోయిన్గా చేస్తున్నట్లు దీంతో క్లారిటీ వచ్చేసింది. అయితే వాస్తవానికి ఈ రోల్ రహస్యంగా ఉంచాలని మేకర్స్ భావించారట. కానీ శృతి ఈ విషయాన్ని బయట పెట్టడంతో మేకర్స్ తల పట్టుకుంటున్నారు.