మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్కు టాలీవుడ్లో కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్లో వరదరాజమన్నార్ పాత్రలో నటించి మెప్పించాడు. ఈ సినిమాలో పృధ్వీరాజ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ప్రస్తుతం పృథ్వీరాజ్ సుకుమారన్.. దిగొట్ లైఫ్.. (అడు జీవితం) మూవీ ప్రమోషన్స్ లో సందడి చేస్తున్నాడు. మార్చి 28న రిలీజ్ కానున్న ఈ సినిమాకు ప్రమోషన్స్ జేరుగా సాగుతున్నాయి. తెలుగులో ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఇందులో భాగంగా నిన్న ఈ మూవీ రిలీజ్ ప్రెస్ మీట్ హైదరాబాద్లో జరిగింది. ఈ ప్రెస్ మీట్లో.. అడు జీవితం మూవీ టీంతో పాటు.. తెలుగు నుంచి మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ వై.యస్.రవిశంకర్, శశి పాల్గొన్నారు.
పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. చిరంజీవితో రెండుసార్లు నటించే అవకాశం వచ్చినా.. రిజెక్ట్ చేయాల్సి వచ్చిందని ఆయన వివరించాడు. మొదటి చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమాలో ఓ కీలక పాత్రలో నటించే అవకాశం వచ్చిందని.. అయితే అడు జీవితం సినిమా కోసం దానిని వదులుకున్నానని.. చిరంజీవి కాల్ చేసి నన్ను అడిగారు.. ఈ మూవీ కోసం ప్రిపేర్ అవుతున్నా అందుకే కుదరడం లేదంటూ వివరించారని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత లూసిఫర్ తెలుగు రీమేక్ గాడ్ ఫాదర్ సినిమాకు కూడా డైరెక్ట్ చేయమని నన్ను అడిగారు.. అప్పుడు కూడా నేను గోట్ లైఫ్ సినిమా కంటిన్యూ చేస్తూ ఉండడంతో మళ్ళీ కాదని చెప్పా.
నువ్వు మళ్ళీ అదే స్టోరీ రిపీట్ చేస్తున్నావ్ అని చిరంజీవి అన్నారు.. అయితే నాకు ఆయన సినిమాల్లో నటించడం ఎంతో ఇష్టం. కానీ కుదరట్లేదు అంటూ వివరించా.. ఫ్యూచర్లో అవకాశం వస్తే ఆయనతో కచ్చితంగా పనిచేయాలని ఉంది అంటూ వివరించాడు. ఇక అడు జీవితం గురించి మాట్లాడుతూ.. 2009లో సినిమా ఫిక్స్ అయ్యాం.. 2018 లో షూటింగ్ మొదలుపెట్టి తెరకెక్కించాం. 90వ దశకంలో జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న ఓ వ్యక్తి కథను ఈ సినిమాలో తెరకెక్కిస్తున్నా. ఇది ఓ నిజజీవిత స్టోరీ ఆధారంగా రూపొందింది అంటూ వివరించాడు. ఈ సినిమా కోసం 31 కిలోల బరువు కూడా తగ్గానని చెప్పుకొచ్చాడు.