టాలీవుడ్ స్టార్ హీరో నిఖిల్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకొని వరుస సినిమాల్లో అవకాశాలను అందుకుంటున్నాడు. ఇటీవల కాలంలో నిఖిల్ ఎంచుకున్న కథలన్నీ పాన్ ఇండియా ప్రాజెక్టులే కావడం విశేషం. ఇక నిఖిల్ ప్రస్తుతం భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్వయంభూ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టి తన స్టార్ స్టేటస్ ను రెట్టింపు చేసుకునే ప్రయత్నాల్లో అహర్నిశలు శ్రమిస్తున్నాడు. కాగా తాజాగా నిఖిల్ దేశం మొత్తం చర్చనీయాంశంగా మారే విధంగా హాట్ కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్లు ఇటీవల జోరుగా సాగిన సంగతి తెలిసిందే. ఇక టీమిండియా ప్రదర్శన ఊహించిన విధంగా లేకపోవడం ఫుట్బాల్ క్రీడల్లో ఇండియా వెనుకబడి ఉండడంతో.. ఆయన నిరాశ చెందారు. తాజాగా క్వాలిఫైయర్ మ్యాచ్లో టీమిండియా ఓటమి.. హీరో నిఖిల్ నీ బాగా హార్ట్ చేసింది. వెంటనే ఏకంగా ఫుట్బాల్ ఎసోసియేషన్కి.. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్కు.. ట్యాగ్ చేస్తూ హాట్ కామెంట్స్ చేశాడు. ఆయన ట్విట్ చేస్తూ ఇప్పుడే టీమిండియా క్వాలిఫైయర్ మ్యాచ్ చూసా. చాలా డిసప్పాయింట్ అయ్యాను అంటూ వివరించాడు.
ఇండియన్ ఫుట్బాల్ అసోసియేషన్ సిగ్గుపడాల్సిన విషయం ఇది. ప్రపంచంలోనే అత్యధిక జనాలు ఉన్న మన దేశంలో ఇంతకంటే మంచి ప్రదర్శన ఇవ్వచ్చు. ఇండియాలో స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ని ప్రక్షాళన చేయాలంటూ.. నిఖిల్ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ను ట్యాగ్ చేస్తూ కోరాడు. నిఖిల్ ట్విట్ పై నెటిజెన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. నిఖిల్ వాదనలోనూ నిజం ఉందని.. ఆయనకు సపోర్ట్గా నిలుస్తున్నారు. ఇక నిఖిల్ ప్రస్తుతం స్వయంభు షూటింగ్లో బిజీగా ఉన్నాడు. దీంతో పాటే రామ్ చరణ్ ప్రొడక్షన్లో వస్తున్న ఇండియన్ హౌస్ సినిమాలోని నటిస్తున్నాడు. అది కూడా పాన్ ఇండియా సినిమానే.
Just watched the Most Frustrating Football Match of our Indian Team at the #FIFAWorldCupQualifiers
The @IndianFootball association should be Ashamed for this embarrassing display. The Most Populous country in the World 🇮🇳 We deserve better.. CHANGE THE SYSTEM @ianuragthakur… pic.twitter.com/Lt9S1P2ltw— Nikhil Siddhartha (@actor_Nikhil) March 21, 2024