నేడు టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజన్న సంగతి తెలిసిందే. చరణ్ పుట్టినరోజున మెగా అభిమానులంతా సందడి చేస్తున్నారు. ఇక చెర్రీ పుట్టినరోజు సందర్భంగా మగధీర మూవీ రీరిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ లో బుకింగ్స్ జరిగాయి. మగధీర సినిమా వేస్తున్న థియేటర్ల్లో గేమ్ చేంజర్ ఫస్ట్ సింగల్ కూడా టెలికాస్ట్ కానుందనిటాక్. ఇక తాజాగా చరణ్ పుట్టినరోజును సెలబ్రేట్ చేస్తూ.. చరణ్ తల్లి సురేఖ చేసిన పని నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. మెగా ఫ్యాన్స్ సురేఖ చేసిన పనికి ఫిదా అవుతున్నారు. చెర్రీ పై తన తల్లి ప్రేమను వ్యక్తపరిచింది సురేఖ.
తన కొడుకు పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకోవటంలో భాగంగా నిన్న 500 మందికి అన్నదానం చేసింది. అపోలో హాస్పిటల్స్లో ఉన్న దేవాలయ పుష్కరోత్సవ కార్యక్రమానికి చినజీయర్ స్వామీజీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ పురస్కారంలో సురేఖ తన చేతితో స్వయంగా వండిన వంటకాలను ఉపాసన చేతుల మీదగా భక్తులకు వడ్డింప చేసింది. ఇక ఉపాసనా ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. దీంతో సురేఖ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు మెగా అభిమానులు.
ఇక ప్రస్తుతం రామ్ చరణ్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తన 17వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇంట్రడక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఇక రాజమౌళి, కార్తికేయ తమ కామెంట్ల ద్వారా ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశారు. వరుసగా మూడు సినిమాలతో భారీ లైనప్ ఏర్పాటు చేసుకున్నాడు చెర్రీ. ఈ మూడు సినిమాల్లో ఏ రెండు సినిమాలు బ్లాక్ బాస్టర్ సక్సెస్ లో అందుకున్నా.. గ్లోబల్ స్టార్ మార్కెట్ రెట్టింపు అవుతుందనటంలో సందేహం లేదు.
View this post on Instagram