ఒకపుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడిపింది రకుల్ ప్రీత్. దాదాపు తెలుగు అగ్ర హీరోల అందరి సరసన నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్కి చెక్కేసి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ క్రమంలో అక్కడి నటుడు, నిర్మాత జాతి భగ్నానితో ప్రేమాయణం నడిపింది. ఇక తాజాగా గోవాలో రకుల్ ప్రీత్, జాకీలా వివాహం గ్రాండ్ లెవెల్లో జరిగింది. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత రకుల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సందడి చేసింది. ఇందులో భాగంగా రకుల్ ప్రీత్కు ఇంటర్వ్యూవర్ ఓ ప్రశ్న సందించారు.
పెళ్లయ్యాక మీ ఇంట్లో.. మీ డ్రెస్సింగ్ స్టైల్ ఏమైనా మార్చుకోవాల్సి వచ్చిందా.. అని ఇంటర్వ్యువర్ రకుల్ ని అడిగాడు. దానికి రకుల్ స్పందిస్తూ నాకు అలా ఎవరు చెప్పలేదు. పుట్టింట్లో, అత్తింట్లో రెండు చోట్ల నేను ఒకేలా నడుచుకుంటున్నా. నా స్వేచ్ఛ నాకు ఇచ్చారు. మన సమాజమే పెళ్లిని పెద్ద మేటర్ లాగా చూస్తోంది. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఉండే ఓ సాధారణ ప్రక్రియ గా భావిస్తే చాలు. అయితే ఆడవాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ గురించి పెళ్లి తర్వాత ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ దగదగా మెరిసే షేర్వాణిలు మాత్రమే ధరించాలని మగవాళ్లకు మీరు చెబుతారా.. చెప్పారు కదా.. అలానే ఆడవాళ్ళ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టకుండా ఉంటే మంచిది.
ఇప్పుడు కాలం మారింది, జనరేషన్లు మారాయి. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉంటారు. ఎవరికి ఇష్టమైన బట్టలు వాళ్లు ధరిస్తారు అంటూ వివరించింది. కాగా రకుల్ చేసిన కామెంట్స్ నెటింట వైరల్గా మారాయి. ఈ నేపథ్యంలో రకుల్ కరెక్ట్ గానే చెప్పింది. పెళ్లయిన తర్వాత ఏ ఆడపిల్ల అయినా ఎందుకు మారాలి.. తమకు నచ్చినట్టు వారి లైఫ్ లీడ్ చేయడంలో తప్పేముంది అంటూ.. మగవారికి నిజంగానే ఎవరు ఎటువంటి సలహాలు ఇవ్వరు.. ఆడవాళ్ళని మాత్రం ఎందుకలా అడుగుతారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.