టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ డైరెక్టర్లుగా దూసుకుపోతున్న వారిలో సుకుమార్ ఒకరు. ఇంటిలిజెంట్ డైరెక్టర్గా క్రేజ్ సంపాదించుకున్న సుకుమార్ ఈయన చేసిన ప్రతి సినిమాతోను ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇక సుకుమార్ మొదటి సినిమా ఆర్య నుంచి పుష్ప వరకు ప్రతి సినిమాలో ఏదో ఒక డిఫరెంట్ స్టోరీ తో ప్రేక్షకులు ముందుకు వస్తూ ఉంటాడు. అయితే సుకుమార్ చేసిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించడమే కాదు ఆయనకు కూడా ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేశాయి. ఇదిలా ఉంటే సుకుమార్ చేసిన ప్రతి సినిమా ప్రేక్షకుడి మైండ్ సెట్ ని ఎక్కడో డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. ఇక సుకుమార్ – రామ్చరణ్ కాంబోలో తెరకెక్కిన రంగస్థలం సినిమా టాలీవుడ్ వద్ద నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో సమంత హీరోయిన్గా రామలక్ష్మి పాత్రలో నటించింది. అయితే మొదట ఈ రామలక్ష్మి పాత్ర కోసం ఏకంగా ఐదుగురు హీరోయిన్లను అనుకున్నారట. అందులో అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేస్ కూడా ఉన్నారు. ఈ క్యారెక్టర్ కి మొదట అనుపమ పరమేశ్వరన్ను తీసుకోవాలని మేకర్స్ భావించారట. కానీ లుక్ టెస్ట్ లో ఆమె క్యారెక్టర్ కి అనుపమ సెట్ అవ్వదు అనిపించి ఆమెను రిజెక్ట్ చేశారు. తర్వాత కీర్తి సురేష్ని సంప్రదించగా ఆమె ఇతర సినిమా షూటింగ్లలో బిజీగా ఉండి ఈ సినిమాలో రిజెక్ట్ చేసిందట.
ఇక వీరిద్దరే కాకుండా మరో ముగ్గురు హీరోయిన్ ఈ మూవీ ఛాన్స్ మిస్ చేసుకున్నారు. చివరకు సమంతను ఈ క్యారెక్టర్ లో తీసుకున్ని తెరకెక్కించారు. దీంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి సమంతకు మార్కెట్ను మరింత పెంచింది. అయితే ఈ సినిమా తర్వాత బన్నీతో పుష్ప సినిమాను తరికేక్కించి పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు సుకుమార్. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 తెరకెక్కుతుంది. ఈ సినిమాను ఇండియా ది బెస్ట్ సినిమాగా నిలపాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఈ సినిమా సక్సెస్ కొడితే సుకుమార్ ఇండియా నంబర్ వన్ డైరెక్టర్గా క్రేజ్ సంపాదించుకుంటాడు అనడంలో అతిశయోక్తి లేదు.