నయనతార 50 సెకండ్ల యాడ్ కు తీసుకునే రెమ్యూనరేషన్ తెలుసా.. ఆ డబ్బుతో ఓ విల్లానే కొనేయొచ్చు..!!

సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్గా క్రేజ్‌ను సంపాదించుకుంది నయనతార. లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుని స్టార్ హీరోలకు మించిన స్టార్‌డంను అందుకుంటూ దూసుకుపోతుంది. కాగా నయనతార ఇటీవల ఓ యాడ్ కు భారీగా రెమ్యూనరేషన్ తీసుకుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. నయనతార సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు పూర్తవుతుంది. అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న మొట్టమొదటి హీరోయిన్. ఒక్కో సినిమాకు ఐదు కోట్లకు పైగా రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. కాగా నయనతార డిమాండ్‌కు తగ్గట్టుగానే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కూడా ఆ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నారు.

అయితే నయన్ ఎక్కువగా యాడ్స్ లో కనిపించదు. కారణం తెలియదు కానీ నాయనతార వ్యాపార ప్రకటనల్లో కనిపించడానికి ఆసక్తి చూపదు. అయితే ఓ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడానికి నయనతార ఇటీవల భారీగా వసూళ్లు చేసినట్లు వార్తలు నెటింట చెక్కర్లు కొడుతున్నాయి. అసలు విషయం ఏంటంటే టాటా స్కై ప్రమోషన్స్ యాడ్స్ లో నయనతార నటించిన సంగతి తెలిసిందే. కేవలం 50 సెకండ్స్ న‌డివి కలిగిన ఈ యాడ్‌లో నయనతార నటించేందుకు.. ఏకంగా రూ.5 కోట్ల రెమ్యూనరేషన్‌ను ఛార్జ్ చేసిందట. దాదాపు స్టార్ హీరోలు కూడా ఎవరు ఈ రేంజ్‌లో రెమ్యూనరేషన్ ఇప్పటి వరకు చార్జ్ చేసి ఉండరు.

అయితే ఒక్క చిన్ని యాడ్ కోసం నయనతార ఏకంగా అన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందని తెలియడంతో అంత షాక్ అవుతున్నారు. మరోపక్క జవాన్‌తో ఎంట్రీచి బాలీవుడ్ లో కూడా బ్లాక్ బ‌స్టర్ హిట్ అందుకుంది. దీంతో నయనతార డిమాండ్ పాన్ ఇండియా లెవెల్ లో ఓ రేంజ్‌కి వెళ్ళింది. ఇక ప్రస్తుతం నయనతార యాడకు తీసుకునే రెమ్యూనరేషన్ భారీగా ఉండ‌టంతో వామ్మో ఇంత రెమ్యూనరేషనా. దీంతో ఓ చిన్న సైజ్‌ డూప్లెక్స్ హౌస్ కట్టేసుకోవచ్చు అంటూ అంత ఆశ్చర్యపోతున్నారు. ఇక 2022లో విగ్నేష్ శివన్‌ను ప్రేమించి వివాహం చేసుకున్న నయన్.. సరోగసి విధానంతో ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఒక పక్కన సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు ఫ్యామిలీతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది నయనతార.